పూర్తిగా అమ్మాయిలా మారిపోయిన మాజీ క్రికెటర్ తనయుడు.. వీడియో వైరల్!
ఆర్యన్ బంగర్గా ఉన్న సమయంలో ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ తరపున క్రికెట్ ఆడటమే కాకుండా, ప్రస్తుతం భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి అండర్-16 స్థాయిలో కూడా ఆడటం విశేషం.
By: Madhu Reddy | 15 March 2026 1:54 PM ISTభారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా లింగ మార్పిడి ప్రక్రియలో ఉన్న ఆయన, తాజాగా థాయిలాండ్లో శస్త్రచికిత్స చేయించుకుని పూర్తిస్థాయిలో అమ్మాయిగా మారారు. తన పేరును అనయా బంగర్గా మార్చుకున్న ఈమె, తన కొత్త జీవితానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. తన మనసు చెప్పిన మాట విని, ఇష్టమైన రీతిలో జీవించేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ వివరాలు చూద్దాం .
ఆర్యన్ నుండి అనయా వరకు:
సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ గతంలోనే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా థాయిలాండ్లో 'వాజినోప్లాస్టీ' అనే శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఈ మార్పు పూర్తి అయ్యింది. ఇక ఇప్పుడు ఆయనను అందరూ అనయా బంగర్ అని పిలుస్తున్నారు. ఇంగ్లాండ్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత మొదటిసారి భారత్కు రావడంతో సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. తన గుర్తింపును మార్చుకోవడం కోసం ఆమె పడిన కష్టం, ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
క్రికెట్ మైదానం నుండి కొత్త ప్రపంచంలోకి:
లింగ మార్పిడికి ముందు అనయా ఒక ప్రతిభావంతుడైన క్రికెటర్. ఆర్యన్ బంగర్గా ఉన్న సమయంలో ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ తరపున క్రికెట్ ఆడటమే కాకుండా, ప్రస్తుతం భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి అండర్-16 స్థాయిలో కూడా ఆడటం విశేషం. క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినా, తన వ్యక్తిగత ఇష్టాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రస్తుతం మాంచెస్టర్లో నివసిస్తున్న అనయా, తన ట్రాన్స్ఫార్మేషన్ జర్నీని చాలా పారదర్శకంగా పంచుకుంటున్నారు. క్రికెట్ కెరీర్ను వదిలి తన మనసుకు నచ్చిన కొత్త జీవితాన్ని ఎంచుకోవడం ఆమె ధైర్యానికి నిదర్శనం.
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు:
అనయా బంగర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది ఆమె ధైర్యాన్ని అభినందిస్తూ, కొత్త జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆమెలోని మార్పును, అందాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే మరికొందరు దీనిపై విమర్శలు చేస్తున్నప్పటికీ, ఎవరి జీవితం వారి ఇష్టమని, వారి నిర్ణయాలను గౌరవించాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ఇక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం సమాజంలో మార్పుకు సంకేతమని పలువురు భావిస్తున్నారు. అనయా తన కొత్త ప్రయాణాన్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో కొనసాగిస్తోంది అని ఆమె ఫాన్స్ భావిస్తున్నారు.
