Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ హీరోయిన్‌ని ఇలా ఎప్పుడూ చూడ‌లేదు!

'క‌హోనా ప్యార్ హై'తో దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న అమీషా ప‌టేల్ ఆ త‌ర్వాత 'బ‌ద్రి' సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది

By:  Tupaki Desk   |   7 Feb 2024 6:08 PM GMT
ప‌వ‌న్ హీరోయిన్‌ని ఇలా ఎప్పుడూ చూడ‌లేదు!
X

'క‌హోనా ప్యార్ హై'తో దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న అమీషా ప‌టేల్ ఆ త‌ర్వాత 'బ‌ద్రి' సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. హృతిక్ స‌ర‌స‌న బాలీవుడ్ లో, ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న టాలీవుడ్ లో ప‌రిచ‌య‌మైంది. అటుపై తెలుగులో ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించింది ఈ బ్యూటీ. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్, బాల‌కృష్ణ లాంటి టాప్ స్టార్ల స‌ర‌స‌న న‌టించింది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఇక్క‌డ ఆశించిన స్థాయికి ఎద‌గ‌లేదు. అటుపై బాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌తో బిజీ అయింది. అక్క‌డ అగ్ర హీరోల స‌ర‌స‌న అమీషా న‌టించింది. కెరీర్ ఆద్యంతం త‌న‌దైన అందం, హొయ‌లుతో ఉర్రూత‌లూగించిన అమీషా ప‌టేల్ కి ఇటీవ‌ల ఏజ్ స‌మ‌స్య‌లు ఎక్కువ‌య్యాయి. వ‌య‌సు పెరుగుతుంటే పోటీ ప్ర‌పంచంలో అమీషాకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దీంతో ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో గేమ్ ఛేంజ‌ర్ గా మారేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలను విడిచిపెట్ట‌డం లేదు. ప‌దే ప‌దే బోల్డ్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. తాజాగా అమీషా షేర్ చేసిన ఫోటోషూట్ దీనికి సింబాలిక్ అంటూ నెటిజ‌నులు కామెంట్లు చేస్తున్నారు.


ఇటీవ‌లే గ‌ద‌ర్ 2తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న‌ అమీషా నిరంత‌రం తన సోషల్ హ్యాండిల్‌లో బోల్డ్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇవ‌న్నీ తక్షణమే వైరల్ అవుతున్నాయి. తాజాగా బ్లాక్ బికినీలో హొయ‌లు పోయిన‌ ఫోటోలు వైరల్ అయ్యాయి. అమీషా బ్లాక్ బికినీని ధరించి అందాల‌ను స్వేచ్ఛ‌గా ప్ర‌ద‌ర్శిస్తోంది. షిమ్మరీ బేస్డ్ మేకప్ లో చాలా స్పెష‌ల్ గా కనిపిస్తోంది. గత ఏడాది గదర్ 2తో బాలీవుడ్‌లోకి కంబ్యాక్ అయిన అమీషాకు ఇప్ప‌టికీ అవ‌కాశాల్లేవ్. అందుకే వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ అమీషా పటేల్ సోషల్ మీడియాలో మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.


అమీషా పటేల్ కెరీర్ ప‌రంగా సుదీర్ఘ కాలం సవాళ్లను ఎదుర్కొంది. త‌న‌ 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కేవలం నాలుగు హిట్ ల‌ను మాత్ర‌మే సాధించింది. సన్నీ డియోల్ సరసన గదర్ తో అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, సన్నీ సోదరుడు బాబీ డియోల్‌తో సినిమాలు త‌న‌ కెరీర్‌ను దెబ్బతీసాయి. హృతిక్ రోషన్ - అమీషా పటేల్ ఇద్దరూ 2000లో విడుదలైన కహో నా ప్యార్ హైతో కెరీర్ ని ప్రారంభించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్రంతో తక్షణ స్టార్‌డమ్‌ని సాధించారు. ఈ స్టార్‌డమ్ పాపులారిటీ కారణంగానే అమీషాకు గదర్‌లో సకీనా పాత్రలో అవ‌కాశం వ‌చ్చింది. కానీ తర్వాత బాబీ డియోల్ సరసన క్రాంతి -హుమ్రాజ్‌లో రెండు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో కనిపించింది. అవి రెండూ డిజాస్ట‌ర్లు అవ్వ‌డంతో త‌న కెరీర్ డోలాయ‌మానంలో ప‌డింది. ఇటీవ‌ల స‌హాయ న‌టిగా కొన‌సాగుతోంది. మ‌రాఠాలోను న‌టిస్తోంది.