Begin typing your search above and press return to search.

బన్నీ మైల్ స్టోన్ మూమెంట్- విగ్రహం చూశారా?

ఇక దుబాయ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని చూసి అల్లు అర్జున్ మురిసిపోయారు! సోషల్ మీడియాలో పిక్ ను షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   28 March 2024 12:42 PM GMT
బన్నీ మైల్ స్టోన్ మూమెంట్- విగ్రహం చూశారా?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన ఘనత! ఇప్పటికే తెలుగు చిత్రసీమ నుంచి నేషనల్ అవార్డు అందుకున్న నేటితరం తొలి నటుడిగా రికార్డు క్రియేట్ చేసిన బన్నీ.. ఇప్పుడు మరో ఘనత సాధించారు. దుబాయ్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో మన అల్లు అర్జున్ మైనపు విగ్రహం కొలువుదీరింది. కొన్ని రోజుల క్రితం బన్నీ నుంచి కొలతలు తీసుకున్న మ్యూజియం నిర్వాహకులు.. వావ్ అనిపించేలా విగ్రహాన్ని రెడీ చేశారు.

అయితే ఈ విగ్రహ ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ ఇప్పటికే దుబాయ్ కు తన ఫ్యామిలీతో వెళ్లారు. సతీమణి స్నేహా రెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ తో కలిసి నగరాన్ని చుట్టేశారు. పలు ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలను విజిట్ చేశారు. షాపింగ్ మాల్స్ సహా బుర్జ్ ఖలీఫా వద్దకు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇటీవల స్నేహ రెడ్డి షేర్ చేసిన విషయం తెలిసిందే.

ఇక దుబాయ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని చూసి అల్లు అర్జున్ మురిసిపోయారు! సోషల్ మీడియాలో పిక్ ను షేర్ చేశారు. వెనక్కి తిరిగి విగ్రహం పక్కన నిల్చుని కిర్రాక్ స్టిల్ ఇచ్చారు. ప్రతి నటుడికి ఇదొక మైల్ స్టోన్ మూమెంట్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ తెగ చక్కర్లు కొడుతోంది. అయితే బ్లాక్ బస్టర్ మూవీ అలా వైకుంఠపురములోని బన్నీ ఐకానిక్ క్యారెక్టర్ ను విగ్రహం ప్రతిబింబిస్తోంది.

ఇప్పటికే వివిధ నగరాల్లో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియాల్లో పలువురు టాలీవుడ్ నటీనటుల విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే. బ్యాంకాక్ మ్యూజియంలో ప్రభాస్, సింగపూర్ మ్యూజియంలో మహేష్ బాబు విగ్రహాలు ఆవిష్కరించారు నిర్వాహకులు. కొన్ని నెలల క్రితం, మహేశ్ బాబు విగ్రహం ఉన్న మ్యూజియంలో కాజల్ విగ్రహం కూడా పెట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో మన ఐకాన్ స్టార్ కూడా చేరిపోయారు.

ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప-2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొన్ని నెలలుగా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీలో కూడా శ్రీవల్లిగా రష్మిక అలరించనుంది. ఇటీవల ఆమె లుక్ కూడా లీకైంది. లెక్కల మాస్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పుష్ప సీక్వెల్ ఎలాంటి సంచలనం సృష్టించిందో చూడాలి.