Begin typing your search above and press return to search.

అక్కినేని బలగం… ఆ ఇద్దరు మిస్

గ్రాండ్ మదర్ బర్త్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇలా ఫ్యామిలీ మొత్తం కలుసుకున్నట్లు సుశాంత్ ఫోటోకి అదనంగా టెక్స్ట్ పోస్ట్ పెట్టారు

By:  Tupaki Desk   |   18 Aug 2023 5:33 AM GMT
అక్కినేని బలగం… ఆ ఇద్దరు మిస్
X

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాల గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగా, మంచు ఫ్యామిలీలు కనిపిస్తాయి. వీరందరూ సినిమాలతో ఏదో ఒక విధంగా అనుబంధం కలిగి ఉన్నవారే. అక్కినేని ఫ్యామిలీకి నటవారసులతో పాటు, తమ సినిమా వ్యాపారాలు చూసుకోవడానికి కొంత మంది ఉన్నారు.


ఏఎన్నార్ మరణం తర్వాత నాగార్జున ఆ కుటుంబానికి పెద్దగా అన్నీతానై చూస్తున్నారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి సందడి చేస్తారు. తాజాగా హీరో సుశాంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో అక్కినేని ఫ్యామిలీ ఫోటో ఒకటి షేర్ చేసుకున్నాడు. అందులో సుశాంత్ తో పాటు అఖిల్, సుమంత్ ఉన్నారు. అలాగే అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

గ్రాండ్ మదర్ బర్త్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇలా ఫ్యామిలీ మొత్తం కలుసుకున్నట్లు సుశాంత్ ఫోటోకి అదనంగా టెక్స్ట్ పోస్ట్ పెట్టారు. అయితే ఈ ఫ్యామిలీ ఫోటోలో కింగ్ నాగార్జున కనిపించలేదు. అలాగే నాగ చైతన్య కూడా ఫోటోలో కనిపించలేదు. దీంతో వారు ఏమయ్యారనే క్వచ్చన్ అక్కినేని అభిమానుల నుంచి వస్తోంది.

ఫ్యామిలీ అందరూ పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో మెయిన్ గా ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరూ మిస్ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఏవో ప్రత్యేక పనులు ఉండటంతోనే పార్టిసిపేట్ చేయడం వలన ఈ బర్త్ డే సెలబ్రేషన్ లో కనిపించకపోయి ఉంటారని భావిస్తున్నారు. కింగ్ నాగార్జున తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోకి కూడా సన్నద్ధం అవుతున్నారు.

నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో చేయబోయే నెక్స్ట్ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. శ్రీకాకుళం నేపథ్యంలో మత్స్యకార ప్రజల కథతో సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో పాకిస్థాన్ కి చిక్కుకున్న ఇండియన్ ఫిషర్ మెన్ గా చైతన్య కనిపిస్తాడని తెలుస్తోంది. నేచురాలిటీకి దగ్గరగా ఉండేలా ఈ మూవీ కథనం సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది.