Begin typing your search above and press return to search.

ట్రెండింగ్‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌వారసుడి డెబ్యూపై బిగ్ లీక్

మెగా అభిమానుల్లో ఈ వార్తా దావాన‌లంలా మారింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమారుడు అకీరా నంద‌న్ తెరంగేట్రానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌దు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 5:10 PM GMT
ట్రెండింగ్‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌వారసుడి డెబ్యూపై బిగ్ లీక్
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార‌సుడు అకీరానంద‌న్ చూడ‌టానికి ఆర‌డుగుల బుల్లెట్టు. టాలీవుడ్ లో ప్ర‌భాస్ త‌ర్వాత అంత హైట్ ఉన్న హీరోగా ఇప్పుడు వ‌రుణ్ తేజ్ పేరు వినిపిస్తోంది. ఆ త‌ర్వాత మెగా కుటుంబం నుంచే మ‌రో పేరు వినిపించ‌డం ఖాయం. అత‌డే ప‌వ‌న్ - రేణుదేశాయ్ జంట‌ వారసుడు అకీరానంద‌న్. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఆర‌డుగుల యువ‌కుడైన‌ అకీరానంద‌న్ వెండితెర క‌థానాయ‌కుడిగా కెరీర్ ని ప్రారంభిస్తాడ‌ని అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. కానీ అత‌డి న‌ట‌నారంగేట్రంపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం లేదు.


కానీ ఇప్పుడు టాలీవుడ్ జెంటిల్మ‌న్ నుంచి ఒక బిగ్ లీక్ వెబ్ ని షేక్ చేస్తోంది. మెగా అభిమానుల్లో ఈ వార్తా దావాన‌లంలా మారింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమారుడు అకీరా నంద‌న్ తెరంగేట్రానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. ఇప్ప‌టికే న‌ట‌శిక్ష‌ణ కొన‌సాగుతోంది. ఏదో ఒక రోజు సైలెంట్ గా సినిమాని ప్ర‌క‌టించేయ‌డం ఖాయం అన్న చ‌ర్చా సాగుతోంది. అయితే దీనికి కార‌ణం ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఇచ్చిన బిగ్ లీక్ అన‌డంలో సందేహం లేదు.

ఇంత‌కుముందే అకీరా నందన్ లేటెస్ట్ ఫోటో ఒక‌టి సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మై పెద్ద‌ చర్చకు దారితీసింది. దీనికి కార‌ణం ద‌ర్శ‌కేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఆన్‌లైన్‌లో అకీరా ఫోటోను షేర్ చేయ‌డ‌మే.. కానీ ఆయ‌న కొన్ని నిమిషాల్లోనే ఆ ఫోటోని తొలగించారు. దీంతో రాఘ‌వేంద్రరావు ఎందుకిలా చేశారు? అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది వెబ్ లోకి రాగానే వెంట‌నే షేర్ అయింది. ప‌లువురు ఆ ఫోటోని స్క్రీన్‌షాట్లు తీసారు. అవి ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.

కే.రాఘ‌వేంద్ర‌రావు ఈ ఫోటోని షేర్ చేసి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని కూడా లీకిచ్చేశారు. త‌న అల్లుడు అయిన శోభు యార్ల‌గ‌డ్డ (బాహుబ‌లి నిర్మాత‌) కుమారుడు కార్తికేయ‌... అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ వార‌సుడు అకీరానంద‌న్ ఇద్దరూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫిల్మ్ స్కూల్ లో చేరార‌ని రాఘవేంద్ర‌రావు వెల్లడించారు. అయితే ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాల్లో లీకివ్వడం స‌రికాద‌ని భావించాడో ఏమో కానీ వెంట‌నే దానిని తొల‌గించారు. అయితే అప్ప‌టికే వెబ్ లో అది వైర‌ల్ అయిపోవ‌డంతో ఇప్పుడు ఈ తొల‌గింపు పెద్ద డిబేట‌బుల్ ఐట‌మ్ గా మారింది.

నిర్మాత శోభు యార్లగడ్డ, లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో కలిసి స్టావాంజర్ సింఫనీ ఆర్కెస్ట్రా ద్వారా బాహుబలి-1 స్పెషల్ స్క్రీనింగ్ కోసం నార్వే వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కి పవన్ కొడుకు అకీరా నందన్.. రేణు దేశాయ్ కూడా హాజరయ్యారు.ఈ స్క్రీనింగుకి అకీరా హాజరయ్యాడనేది బ‌య‌టి ప్ర‌పంచానికి తెలీదు. కానీ అకీరా అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. శోభు కుమారుడు కార్తికేయ - అకీరా ఇద్ద‌రూ కే.రాఘ‌వేంద్ర‌రావుతో ఫోజులిచ్చారు. ఆ ఫోటోనే రాఘ‌వేంద్రరావు సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసి తిరిగి వెంట‌నే తొల‌గించారు. కానీ అప్ప‌టికే స‌మ‌యం మించిపోయింది. అస‌లు విష‌యం అభిమానుల్లో దావాన‌లంలా వ్యాపించింది.

అకీరా నందన్ త్వరలో హీరోగా అరంగేట్రం కోసం రెడీ అవుతున్నాడు అనే విష‌యంపై మెగాభిమానుల‌కు ఇప్పుడు మ‌రింత స్ప‌ష్ఠ‌త వచ్చేసింది. ప‌వ‌న్ - రేణు దేశాయ్ జోడీ త్వ‌ర‌లోనే అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాల్సి ఉంది.