‘షష్టిపూర్తి’తో ఎమోషనల్ జర్నీ: ఆకాంక్ష సింగ్
రూపేష్, ఆకాంక్ష సింగ్ జంటగా నటిస్తున్న ‘షష్టిపూర్తి’ సినిమా మే 30, 2025న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 21 May 2025 5:41 PMరూపేష్, ఆకాంక్ష సింగ్ జంటగా నటిస్తున్న ‘షష్టిపూర్తి’ సినిమా మే 30, 2025న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలో రాజేంద్ర ప్రసాద్, అర్చన కీలక పాత్రల్లో నటిస్తుండగా, పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి బ్యానర్పై రూపేష్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సూపర్ హిట్ సాంగ్స్తో ఆడియన్స్ను ఆకర్షించిన ఈ సినిమా, ఇళయరాజా సంగీతంతో మరింత హైప్ సంపాదించింది.
ఈ నేపథ్యంలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రమోషన్స్లో భాగంగా ఆకాంక్ష మాట్లాడుతూ, తాను జానకి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. “ఇది ఒక సాంప్రదాయ తెలుగు అమ్మాయి, ఆలయ ట్రెజరర్ పాత్ర. రాజమండ్రిలో 40 రోజులు షూట్ చేశాం, నాకు ఇలాంటి పాత్ర మొదటిసారి” అని చెప్పింది.
ఈ పాత్రలో ఎన్నో షేడ్స్ ఉన్నాయని, ఇది రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదని, సినిమా ఎమోషనల్ కంటెంట్తో ఆడియన్స్ను కదిలిస్తుందని ఆమె వెల్లడించింది. సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ను ఆకాంక్ష ప్రత్యేకంగా ప్రశంసించింది. “ఈ సినిమా సెట్లో నాకు యాక్టింగ్ స్కూల్కు వెళ్లిన అనుభవం కలిగింది. రాజేంద్ర ప్రసాద్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా నేర్పింది” అని అన్నారు.
దర్శకుడు పవన్ ప్రభ విజన్, క్లారిటీని, నిర్మాత-నటుడు రూపేష్ సినిమా పట్ల చూపిన అంకితభావాన్ని కూడా ఆమె మెచ్చుకున్నారు. సంగీతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్ష చెప్పింది. “ఇళయరాజా గారితో పనిచేయడం నిజంగా ఆశీర్వాదం. ఆయన సంగీతం సినిమాకు ఎమోషనల్ డెప్త్ను తీసుకొచ్చింది” అని ఆమె అన్నారు.
ఎంఎం కీరవాణి రాసిన ‘ఏదో ఎదో’ సాంగ్, చైతన్య ప్రసాద్ రాసిన టైటిల్ సాంగ్ ఇప్పటికే హిట్ లిస్ట్లో ఉన్నాయి. ఈ సినిమా సంగీతం కుటుంబ కథనానికి మరింత బలం చేకూరుస్తుందని ఆమె తెలిపింది. మొత్తంగా, ‘షష్టిపూర్తి’ సినిమా అభిమానులను ఎమోషనల్ జర్నీలో ముంచెత్తనుందని ఆకాంక్ష చెప్పింది. “కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. స్టోరీలో ఎమోషన్స్ అందరినీ కదిలిస్తాయి” అని ఆమె అన్నారు.