Begin typing your search above and press return to search.

ప్రభాస్ తరువాత అతనికి కూడా 150 కోట్లా?

ప్రభాస్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ ఇళయదళపతి విజయ్.

By:  Tupaki Desk   |   4 March 2024 3:30 PM GMT
ప్రభాస్ తరువాత అతనికి కూడా 150 కోట్లా?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడిగా ఉన్నాడు. కల్కి2898 ఏడీ చిత్రం కోసం ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ ని ప్రభాస్ తీసుకుంటున్నాడు. నెక్స్ట్ చేయబోయే స్పిరిట్ కోసం కూడా అతను ఇదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ ఇళయదళపతి విజయ్.


అతను ఒక్కో సినిమాకి 120 కోట్లకి పైగా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన స్టార్ హీరోలు 80 నుంచి 100 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ లో రాకింగ్ స్టార్ యష్ కూడా 150 కోట్లు రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నాడు. అది కూడా నెగిటివ్ రోల్ కోసం కావడం విశేషం. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రామాయణం సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపించబోతోంది. రావణుడి పాత్ర కోసం యష్ ని ఖరారు చేశారని టాక్. త్వరలో మూవీకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో యష్ కంటే రణబీర్ కపూర్ కి తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారంట.

కేజేఎఫ్ సిరీస్ రాకింగ్ స్టార్ యష్ కి సౌత్ లో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. సాయి పల్లవికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఇద్దరు స్టార్స్ ని తీసుకోవడం ద్వారా సౌత్ లో కూడా రామాయణం మూవీకి అద్భుతమైన ఆదరణ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. వీరి కారణంగా సౌత్ లో నాలుగు భాషలలో కూడా సినిమాకి హైప్ రావడం ఖాయం అని చెప్పొచ్చు.

రామాయణం సిరీస్ కి 150 కోట్లు రెమ్యునరేషన్ యష్ తీసుకుంటే అతని నెక్స్ట్ మూవీస్ కూడా అదే స్థాయిలో డిమాండ్ చేసే అవకాశం ఉంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన స్టార్ యాక్టర్ మొదటి సారి వారి ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ గా మారాడు. ఇది నిజంగా ప్రత్యేకం అని చెప్పాలి. ఇదే నిజమైతే ప్రభాస్ తర్వాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ యష్ అవుతాడని చెప్పొచ్చు.