Begin typing your search above and press return to search.

ఇంతకు మించి దిగజారకండి ప్లీజ్!

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి

By:  Tupaki Desk   |   24 March 2024 7:31 AM GMT
ఇంతకు మించి దిగజారకండి ప్లీజ్!
X

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా చేసి చూపించి పుకార్లు అల్లేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ సోషల్‌ మీడియా కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గాలి వార్తలను ప్రచారం చేయడమే పనిగా కొంత మంది సోషల్‌ మీడియాలో పని చేస్తున్నారు. వారందరికి సీనియర్‌ హీరోయిన్ మీనా సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారు. ఆమె గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో మరియు కొన్ని మెయిన్‌ స్ట్రీమింగ్ మీడియాలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

భర్తను కోల్పోయిన మీనా ప్రస్తుతం ఒక హీరోతో రిలేషన్ లో ఉందనేది ఆ పుకార్ల సారాంశం. ఆమె రెండో పెళ్లి కి సిద్దం అవుతుంది అని కూడా గత కొన్ని రోజులుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై ఆమె చాలా సీరియస్‌ గా స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది.

మీనా మాట్లాడుతూ... డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా? సోషల్ మీడియాలో కొందరు రోజు రోజుకు దిగజారి ప్రవర్తిస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఊహించేసుకుంటూ కథనాలు అల్లుతున్నారు. ఇంతకు మించి దిగజారకుండా ఉంటే మంచిది అంటూ ఆమె హెచ్చరించారు.

ప్రస్తుతం తాను సింగిల్ మదర్‌ గానే ఉన్నాను. దేశంలో ఎంతో మంది ఒంటరి మహిళలు ఉన్నారు. ప్రస్తుతం నా తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం. 2022 లో మీనా భర్త విద్యాసాగర్‌ మృతి చెందారు. ఆయన మృతి చెందిన సమయంలో కూడా మీనా గురించి సోషల్ మీడియాలో కొందరు తప్పుడు రాతలు రాశారు. ఒంటరి మహిళ పై ఇలాంటి రాతలు ఏమాత్రం సబబు కాదని ఆమె అభిమానులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు.