Begin typing your search above and press return to search.

కృష్ణ ఫ్రమ్ బృందావనం.. ఆది క్రేజీ కాంబినేషన్

సీనియర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ కొడుకు ఆది.. ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   18 April 2024 10:03 AM GMT
కృష్ణ ఫ్రమ్ బృందావనం.. ఆది క్రేజీ కాంబినేషన్
X

సీనియర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ కొడుకు ఆది.. ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీ ప్రేమ కావాలితో సూపర్ హిట్ అందుకున్న ఆది.. ఆ తర్వాత లవ్లీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం సుకుమారుడు, రఫ్ అంటూ పలు యాక్షన్ సినిమాలు చేశాడు ప్రస్తుతం తన ఇమేజ్ కు సరిపడా స్టోరీ, దర్శకులను ఎంచుకునే పనిలో ఉన్నారు.

తాజాగా ఆది కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పటికే చుట్టాలబ్బాయి మూవీ కోసం పనిచేసిన వీరభద్రం చౌదరితో మళ్లీ చేతులు కలిపారు. విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీకి కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ మూవీ పూజా కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.

కాకతీయ హిల్స్‌ లోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి అతిథులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, డైలాగ్ కింగ్ సాయి కుమార్ హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌ కు దిల్ రాజు క్లాప్ కొట్టారు. స్క్రిప్ట్ అందజేస్తూ కెమెరాను సాయి కుమార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఆది, సాయి కుమార్, వీరభద్రం చౌదరి మాట్లాడారు.

"చుట్టాలబ్బాయి తర్వాత మరో సినిమా చేయాలని వీరభద్రం గారు, నేను ప్రయత్నించాం. కానీ సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళకు మంచి స్క్రిప్ట్ దొరికింది. ఆడియెన్స్ తమ కుటుంబంతో కలిసి చూసి నవ్వుకునేలా ఈ మూవీ ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ ఫెల్లో మూవీలో నేను, దిగంగనా సూర్యవంశీ జోడీగా నటించాం. ఇప్పుడు మరోసారి ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నాం. మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులతో ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. అన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తాం" అని ఆది సాయికుమార్ తెలిపారు.

ఈ మూవీలో హీరోయిన్ రోల్ కు మంచి ఇంపార్టెన్స్ ఉందని దర్శకుడు వీరభద్రం తెలిపారు. ఈ సినిమాను ప్రొడ్యూసర్లు తూము నరసింహా, జామి శ్రీనివాసరావు ఖర్చుకు ఏ మాత్రం కూడా వెనుకాడకుండా నిర్మించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, రామ్ డైలాగ్స్, శ్యాం విజువల్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్‌ గా నిలుస్తాయని అన్నారు. తమకు అండగా నిలిచిన మీడియాకు థాంక్స్ చెప్పారు.

ఇక సాయి కుమార్ మాట్లాడుతూ.. "వీరభద్రం మూవీల్లోని ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు తీస్తుంటారు. కృష్ణ ఫ్రమ్ బృందావనం మూవీ కూడా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాగా ఉండబోతుంది. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మంచి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని సాయి కుమార్ తెలిపారు. మరి ఈ మూవీ.. ఆదికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.