Begin typing your search above and press return to search.

కర్ణాటకలో షాకింగ్ హత్య.. రీల్స్ చేసే ఆమెను అక్కా అంటూ.. కట్ చేస్తే!

ఆమెపై చెడు ఆలోచనలతో ఆమెను సొంతం చేసుకోవాలని ప్రయత్నించటం.. అందుకు ఆమె నో చెప్పటంతో ఆమెను హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   25 Jan 2024 4:47 AM GMT
కర్ణాటకలో షాకింగ్ హత్య.. రీల్స్ చేసే ఆమెను అక్కా అంటూ.. కట్ చేస్తే!
X

కర్ణాటకలోని ఒక దారుణ హత్య సంచలనంగా మారింది. రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పేరున్న 28 ఏళ్ల నందిని కొద్ది రోజులుగా కనిపించకుండా పోవటం.. కట్ చేస్తే..తాజాగా ఆమెను హత్య చేసిన వైనం వెలుగు చూసింది. టీచర్ గా ఉంటూ రీల్స్ చేసే అలవాటున్న ఆమె.. అదే శాపమైంది. అక్కా అంటూ ఆత్మీయంగా పిలిచే ఒక కుర్రాడు.. ఆమెపై చెడు ఆలోచనలతో ఆమెను సొంతం చేసుకోవాలని ప్రయత్నించటం.. అందుకు ఆమె నో చెప్పటంతో ఆమెను హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది.

కర్ణాటకలోని మండ్య పరిధిలోని మేలుకొటే సమీపంలో ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పని చేస్తుంటారు 28 ఏళ్ల నంది. అందంగా.. ఆకర్షణీయంగా ఉండే ఆమెకు పెళ్లై.. ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. భర్త ప్రోత్సాహంతో టీచర్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు రీల్స్ చేయటం ఒక వ్యసనంగా మారింది.ఈ క్రమంలో 22 ఏళ్ల నితేశ్ అనే యువకుడు రెండేళ్ల క్రితం పరిచయం అయ్యాడు. అక్కా అంటూ ఆత్మీయంగా ఉండేవాడు. అన్నింట్లోనూ సాయంగా ఉండేవాడు. దీంతో.. ఆమె అతన్ని నమ్మింది. నిజంగానే తమ్ముడిగా భావించింది.

అక్కా.. తమ్ముళ్లుగా వారిద్దరు కలిసి కొన్ని రీల్స్ కూడా చేశారు. అయితే.. ఆమెపై చెడు అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని.. పైకి మాత్రం అక్కా అంటూ ఆత్మీయంగా ఉండే నితేశ్.. ఆమెతో ప్రియురాలిగా కొన్ని రీల్స్ చేద్దామని పట్టుబట్టేవాడు. ఆ క్రమంలో ఆమెను ఒకసారి టచ్ చేశాడు. దీంతో.. సీరియస్ అయిన ఆమె.. అతడ్ని హెచ్చరించింది. దీంతో.. తన గురించి.. తాను చేసిన పని గురించి ఆమె బయటకు చెప్పేస్తుందన్న అనుమానంతో ఆమెను తాజాగా హత్య చేసి.. ఆమె శవాన్ని కనిపించకుండా పూడ్చేశాడు.

అయితే.. ఆమె కనిపించకుండాపోవటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. మేలుకోటె యోగ నరసింహ స్వామి కొండ వెనుక భాగంలో ఒక టూ వీలర్ నిలిపి ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అక్కడి మట్టిని తవ్వినట్లుగా ఆనవాళ్లు ఉండటంతో.. అక్కడ తవ్వించారు. అందులో నిర్జీవంగా పడి ఉన్న నందిని డెడ్ బాడీని గుర్తించారు.

స్కూల్ కు వెళ్లిన ఆమెను మాయమాటలు చెప్పి.. ఆమెను యోగనరసింహ స్వామి కొండ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి ఆమె మీద తనకున్న ఇష్టాన్ని ప్రదర్శించగా.. అందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో.. ఆమెను హత్య చేశాడు.

అయితే.. నందినితో అతడు గొడవ పడే ద్రశ్యాల్ని ఒక పర్యాటకురాలు తన కెమేరాతో బంధించి.. వాటిని పోలీసులకు అందించారు. దీంతో.. అతడ్ని గుర్తించి అదుపులోకి తీసుకోగా.. తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో ట్విస్టు ఏమంటే.. ఆమెను హత్య చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లకుండా.. ఊళ్లోనే ఉంటూ.. అక్క ఎక్కడికి వెళ్లిందంటూ ఆరా తీసేవాడు. తన మీద అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

అయితే.. సంపన్న కుటుంబానికి చెందిన నితేశ్ కు రాజకీయ పరిచయాలు ఉండటంతో.. హత్య కేసు విచారణ పక్కదారి పడుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. పోలీసులు ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. తాజా ఉదంతం గురించి తెలిసిన వారంతా.. క్షీణిస్తున్న మానవ విలువలు.. మానవ సంబంధాలపై చర్చించుకోవటం గమనార్హం.