Begin typing your search above and press return to search.

గడ్డివాము దగ్గర భార్యను చూశానని తగలెట్టేశాడు

ఘోర ఘటన చోటు చేసుకుంది. దేశంలో సంచలన నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఉత్తరప్రదేశ్ లోనూ తాజా ఉదంతం చోటు చేసుకుంది

By:  Tupaki Desk   |   20 Nov 2023 4:09 AM GMT
గడ్డివాము దగ్గర భార్యను చూశానని తగలెట్టేశాడు
X

ఘోర ఘటన చోటు చేసుకుంది. దేశంలో సంచలన నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఉత్తరప్రదేశ్ లోనూ తాజా ఉదంతం చోటు చేసుకుంది. భార్య మీద అనుమానంతో పాటు.. గడ్డివాము దగ్గర అభ్యంతరకర స్థితిలో భార్యను చూశానంటూ భర్త ఒకరు.. ఆమెను కర్కశంతో తగలబెట్టేసిన వైనం షాకింగ్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన షాకింగ్ గా మారింది.

యూపీలోని బరేలి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. నేపాలీ సింగ్.. అంజలి (35) భార్యభర్తలు. వీరిద్దరి మధ్య సంబంధాలు సరైన రీతిలో లేవు. తన భార్యకు వేరే వారితో సమ్ థింగ్ ఉందన్న సందేహం ఉంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న అతగాడు.. ఇటీవల తన భార్య గడ్డివాము దగ్గర అభ్యంతరకర స్థితిలో చూసినట్లుగా చెబుతున్నారు. అందులో నిజం ఎంత? అన్నది కూడా తేల్చాల్సి ఉంది.

గడ్డివాము దగ్గర తన భార్య అభ్యంతరకర స్థితిలో కనిపించిందన్న ఆగ్రహంతో ఊగిపోయిన అతను భార్య మీద అనుమానానికి గురయ్యాడు. ఆ వెంటనే.. ఆమె ఉన్న గడ్డివాముకు నిప్పు పెట్టేశాడు. దీంతో.. ఆమె మంటల్లో కాలింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు.. గడ్డివాము మంటల్లో ఇరుక్కుపోయిన ఆమెను బయటకు లాగారు. అప్పటికే ఆమె శరీరం పెద్ద ఎత్తున కాలి.. మరణించినట్లుగా చెబుతున్నారు.

సగానికి పైగా కాలిన డెడ్ బాడీని బయటకుతీసిన గ్రామస్తులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతంపై ఆరోపణలు ఎదుర్కొంటునన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని ప్రశ్నించారు. గడ్డివాము దగ్గర తన భార్య వేరే వ్యక్తితో అభ్యంతకర స్థితిలో ఉంటాన్ని చూశానని.. అందుకే గడ్డివాముకు నిప్పు పెట్టినట్లుగా నేపాలీ సింగ్ పోటీసులకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. బాధితురాలు అంజలీ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు కట్టి.. విచారణ చేస్తున్నారు.