Begin typing your search above and press return to search.

మార్చి బాక్సాఫీస్.. టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ ఇలా!

టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో కలిపి 13 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 Feb 2024 5:47 AM GMT
మార్చి బాక్సాఫీస్.. టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ ఇలా!
X

మార్చి నెల.. ఇట్స్ ఎగ్జామ్స్ టైమ్.. విద్యార్థులంతా పరీక్షల్లో బిజీగా ఉంటారు. తల్లిదండ్రులేమో వారిని చదివించే పనిలో ఉంటారు. చాలా మంది ఎలాంటి టూర్లు, క్యాంపులు పెట్టుకోరు. ఫంక్షన్లకు కూడా తక్కువగానే అటెండ్ అవుతుంటారు. కేవలం దృష్టంతా ఎగ్జామ్స్ పైనే పెడతారు. దీంతో ఈ సీజన్ లో సినిమాలు కాస్త తక్కువగానే రిలీజ్ అవుతుంటాయి. ఆడియన్స్ తాకిడిని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ మంత్ లో రిలీజ్ చేస్తుంటారు మేకర్స్.

అయితే ఈ సారి మాత్రం బాక్సాఫీస్ వద్ద సినిమాల రూట్ మారింది. ఎప్పుడూ లేనంతలా భారీ స్థాయిలో మూవీలు రిలీజ్ అవుతున్నాయి. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో కలిపి 13 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇన్ని తెలుగు స్ట్రయిట్ మూవీలు.. మార్చి నెలలో రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. అయితే ఏప్రిల్ లేదా మేలో పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మార్చిలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ మొగ్గు చూపిస్తున్నారు. ఓ సారి మార్చి బాక్సాఫీస్ పరిస్థితేంటో చూద్దాం.

ఇక మార్చి 1న శుక్రవారం పడుతుండడంతో ఫస్ట్ రోజు నుంచే సినిమాల సందడి మొదలు కానుంది. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వరుణ్.. ఈ మూవీ కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి బజ్ కూడా క్రియేట్ అయింది. ఈ మూవీతోపాటు చారి 111, భూతద్దం భాస్కర్ నారాయణ, రామ్ గోపాల్ వర్మ వ్యూహం, రజాకార్ మూవీలు కూడా విడుదల కానున్నాయి.

రెండో వారంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సందడి చేయనున్నారు. ఆయన నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ గామి మూవీ మార్చి 8వ తేదీన రిలీజ్ కానుంది. నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ తోపాటు మూవీ లవర్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతోపాటు గోపీచంద్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భీమా మూవీ కూడా అదే రోజు విడుదల కానుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు గోపీచంద్. ఆర్జీవీ శపథం, ఉత్సవం కూడా శివరాత్రి కానుకగానే థియేటర్లోకి రానున్నాయి.

బ్రోచెవారెవరురా కాంబో మరోసారి రిపీట్ కానున్న విషయం తెలిసిందే. హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటిస్తున్న ఓం భీమ్ బుష్ మూవీ.. మార్చి 22వ తేదీన విడుదల కానుంది. వీరి కాంబోలో మరోసారి కడుపుబ్బా నవ్వుకోవడానికి ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీతోపాటు మరో రెండు చిత్రాలు.. ఆ ఒక్కటి అడక్కు, కలియుగం పట్టణంలో థియేటర్లో సందడి చేయనున్నాయి.

ఇక మంత్ లాస్ట్ లో యంగ్ హీరో సిద్ధు జొన్నలగొడ్డ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ నటించిన రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ మూవీ టిల్లు స్క్వేర్‌ మార్చి 29వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్.. యూత్ ను ఎంతో ఆకట్టుకుంది. మొత్తానికి మార్చి నెలంతా వరుస సినిమాలు సందడి చేయనున్నాయన్నమాట. మరి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.