ఐసీయూలో తారకరత్న.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా : చంద్రబాబు

Update: 2023-01-28 22:21 GMT
నందమూరి హీరో తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తారకరత్న భార్య అలేఖ్య, తండ్రి మోహనకృష్ణలతోపాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

‘నారాయణ హృదయాల ఆస్పత్రి వైద్యులు కుప్పం వచ్చినప్పటి కంటే అక్కడి కంటే బెంగళూరులో ట్రీట్ మెంట్ బెటర్ గా ఉంటుందనే ఉద్దేశంతోనే డాక్టర్ల సలహా మేరకు రాత్రి 2 గంటలకు ఇక్కడికి తీసుకొచ్చారు. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ’ చంద్రబాబు తెలిపారు.

తారకరత్న కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని వైద్యులు తెలిపారని చంద్రబాబు మీడియాకు వివరించారు. వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని  ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

ఇక తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారని పురంధేశ్వరి చెప్పారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి అంచనావేస్తామని డాక్టర్లు చెప్పారని తెలిపారు.

తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ, నందమూరి సుహాసిని, పరిటాల శ్రీరామ్ ఆస్పత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News