హైదరాబాద్‌లో బయటపడ్డ మరో హైటెక్ వ్యభిచారం !

Update: 2020-06-16 00:30 GMT
హైదరాబాద్ లో మరో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో సులభంగా డబ్బు సంపాదించాలనే కోణంలో అలోచించి , ఒకవైపు వైరస్ అలజడి సృష్టిస్తున్న సమయంలో కూడా ఆ ఫ్యామిలీ మాత్రం హైటెక్ వ్యభిచారానికి తెరతీసింది. స్థానిక యువతులతో కంటే ముంబై నుంచి అమ్మాయిలను తెపిస్తే, ఎక్కువ డబ్బు రాబట్టవచ్చని ఆ దంపతులు అనుకున్నారు. ఇద్దరు యువతులను హైదరాబాద్ తీసుకొచ్చారు. కాటేదాన్‌ లోని ఓ ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేశారు.

ఇందులో భాగంగా ...ఓ ఆటో డ్రైవర్‌ తో డీల్ కుదుర్చుకున్నారు. ఆటో డ్రైవర్ పనేంటంటే, ప్రతి రోజూ ఈ అమ్మాయిలను ఆటోలో ఎక్కించుకొని, పాత బస్తీ, రాజేంద్రనగర్ సర్కిల్స్‌ కి తీసుకెళ్తాడు. అక్కడ ఎవరు బేరం మాట్లాడుకున్నారో వాళ్ల ఇంటి దగ్గర వదిలేస్తాడు. ఆ తర్వాత మళ్లీ వాళ్లను తిరిగి కాటేదాన్ ఇంటికి తెస్తాడు. ఇలాగే గత కొన్ని రోజులుగా ఈ యవ్వారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది. ఈ బేరాలూ అవీ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. బేరం డిసైడ్ అయ్యాక, సగం మనీ ముందుగా తమ అకౌంట్లలో వెయ్యమంటున్నారు. తర్వాత, ఆటో డ్రైవర్ ద్వారా అమ్మాయిలను పంపుతున్నారు. మిగతా సగం మనీ తర్వాత డిపాజిట్ చేయించుకుంటున్నారు.
Read more!

రోజులాగే గత మూడు రోజుల క్రితం ఇలాగే కొందరితో డీల్ కుదుర్చుకున్నారు. శాస్త్రిపురం డివిజన్‌ లోని కింగ్స్ కాలనీలో ఆటో ఆగింది. ఆటోలోంచి అమ్మాయిలు దిగారు. రాత్రివేళ వాళ్లను చూడగానే , అక్కడి  స్థానికులకు తేడా కొట్టింది. ఎవరా అమ్మాయిలు, ఎందుకు వచ్చారు ... ఏదో జరుగుతోంది అని డౌట్ పడ్డారు. ఆలోపే  అక్కడికి ఇద్దరు యువకులు వచ్చారు. వాళ్లు కూడా అమ్మాయిలు ఉన్న ఇంట్లోకి వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. దానితో వారికీ అక్కడ ఏమి జరుగుతుందో ఓ క్లారిటీ వచ్చేసింది. వెంటనే పోలీసులకు కాల్స్ వెళ్లాయి.అర్ధరాత్రి సమయంలో పోలీసులు రైడ్ చేశారు. నిర్వాహకులతో పాటు చెందిన యువకులను అరెస్టు చేశారు. ఆ ఇద్దరు అమ్మాయిలను సంరక్షణ గృహానికి తీసుకెళ్లారు.
Tags:    

Similar News