సీఎం హెలీకాప్ట‌ర్‌ కు త‌ప్పిన ఘోర ప్ర‌మాదం..

Update: 2017-04-24 13:00 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు స‌మ‌యం క‌లిసి రావ‌డం లేన‌ట్లుంది. ఇటీవల వ‌రుస వివాదాల్లో చిక్కుకున్న సిద్ధ‌రామ‌య్యకు తాజాగా ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న‌తో పాటుగా క‌ర్ణాట‌క హోంమంత్రి పరమేశ్వర నేడు వెంట్రుకవాసిలో ఘోర ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. శ్రావణబెళగొళ‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు బెంగ‌ళూరు నుంచి సిద్దరామయ్య ఈరోజు హెలికాప్టర్ ద్వారా రెడీ అయ్యారు. ఈ ప్ర‌యాణంలో ఆయనతో పాటు హోంమంత్రి పరమేశ్వర - మరో ముగ్గురు అధికారులు వెంట ఉన్నారు.

అయితే హెలీకాప్ట‌ర్ టేకాఫ్‌ చేస్తుండగా ఒక పక్షి ఢీకొంది. దీంతో ఒక్కసారిగా క‌ల‌క‌లం రేకెత్తింది. అప్ర‌మ‌త్త‌త‌మైన పైల‌ట్ హెలికాప్టర్‌ ను అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. హెలికాప్టర్‌ ను క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత తిరిగి బయలుదేరింది. దీంతో పెనుముప్పు త‌ప్పిన‌ట్ల‌యింది. గ‌త ఏడాది కాలంగా సిద్ధ‌రామ‌య్య‌కు ఇబ్బందిక‌ర‌మైన పరిస్థితులు ఎదుర‌వుతూ ఉన్నాయి. పార్టీలోని నెల‌కొన్న ఇబ్బందుల‌తో పాటుగా ప‌రిపాల‌న‌లోనూ ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కున్నారు. అదే స‌మ‌యంలో గ‌త ఏడాది సిద్ధ‌రామ‌య్య కుమారుడు చ‌నిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News