ఈశ్వరుడికి ధన్యవాదాలు. కరోనా నెగెటివ్ వచ్చింది

Update: 2020-08-14 16:30 GMT
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనాను జయించారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ గా తేలింది. మరికొంత కాలం ఐసోలేషన్ లో ఉంటానని అమిత్ షా వెల్లడించారు.

కరోనా బారిన పడ్డ అమిత్ షాకు రెండు వారాలుగా ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాజాగా జరిపిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా వచ్చిందని తెలిపారు.

‘ఈశ్వరుడికి ధన్యవాదాలు. కరోనా నెగెటివ్ గా వచ్చింది. నా ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థించి.. నా కుటుంబ క్షేమం కోసం కాక్షించిన వారందరికీ ధన్యవాదాలు. వైద్యుల సలహామేరకు మరికొన్ని రోజులు ఐసోలేషన్ లో ఉంటాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

కరోనా వచ్చిన తర్వాత నాకు ధైర్యం చెప్పిన వారు.. నాకు వైద్యం అందించిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు అంటూ హిందీలో అమిత్ షా మరో ట్వీట్ చేశారు.
Full View
Tags:    

Similar News