200 మందిని ఉద్యోగం నుంచి తొలగించిన యూఎస్ కంపెనీ.. తెలుగు డొనేషన్ స్కామ్ వల్లే..!
ఇక TANA కూడా ఈ అవకతవకలో భాగంగా అన్వేషణకు గురైంది. ప్రస్తుతం FBI, IRS Department of Justice (DOJ) TANA పై విచారణ చేస్తోంది.;

అమెరికాలోని ఫెన్నీ మే (Fannie Mae) సంస్థ 700 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ 200 మంది.. ఎక్కువగా తెలుగు వ్యక్తులు అవ్వడం గమనర్హం. వీరందరూ కూడా డొనేషన్ స్కామ్ లో చిక్కుకొని ఉద్యోగం పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ మోసానికి సంబంధించి…ఫెన్నీ మేకి సంబంధించిన "మెచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్" అనే కార్యక్రమం దుర్వినియోగం అయ్యింది. ఈ ప్రోగ్రామ్.. సాధారణంగా ధర్మసంస్థలకు విరాళాలను పెంపొందించడానికి రూపొందించబడింది.
అయితే కొంతమంది ఉద్యోగులు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) వంటి చారిటబుల్ సంస్థలతో కలిసి, సంస్థ విరాళాలను దుర్వినియోగం చేశారు. ఈ వివాదంలో, ఒక ఉద్యోగి TANAలో ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్గా పని చేశాడు.. మరొకరు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మాజీ అధ్యక్షుడి భార్యగా ఉన్నారు.
ఇక ఇది 2025 జనవరిలో జరిగిన ఒక స్కాండల్ ని అనుసరించి జరగటం మరో విశేషం. ఆ స్కామ్ ప్రకారం Apple సంస్థలో 100 మందికి పైగా ఉద్యోగులు తమ "మెచింగ్ గిఫ్ట్ ప్రోగ్రామ్"ను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రోగ్రామ్ లో ఉద్యోగుల విరాళాలు చారిటబుల్ సంస్థలకు ఇవ్వబడతాయి.. ఆ తరువాత సంస్థ వీటికి సమానంగా డొనేషన్లు చేస్తుంది.
ఇక TANA కూడా ఈ అవకతవకలో భాగంగా అన్వేషణకు గురైంది. ప్రస్తుతం FBI, IRS Department of Justice (DOJ) TANA పై విచారణ చేస్తోంది. మరొక పబ్లిక్ కోర్టు డిసెంబర్ 2024లో TANA నుండి గ్రాండ్ జ్యూరీకి నివేదికలు, విరాళాల వివరాలు.. 2019 నుండి 2024 వరకు వ్యవస్థాపకులు సంబంధిత వివరాలను అందించాలని ఆదేశించింది.
ఇక ఈ అవకతవకలు, సంస్థల ధర్మసంస్థల ప్రోగ్రామ్లను సరిగ్గా నిర్వహించడంపై సందేహాలను పెంచాయి.