కీలక పరిణామం.. సుబ్బారెడ్డి లాబీయింగ్ ని నవ్వుతూ తిరస్కరించిన ఆర్కే!!

వైసీపీ నాయకుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కి సంబంధించిన ఓ ఆసక్తికర పరిణామం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.;

Update: 2025-06-02 06:26 GMT
కీలక పరిణామం.. సుబ్బారెడ్డి లాబీయింగ్ ని నవ్వుతూ తిరస్కరించిన ఆర్కే!!

వైసీపీ నాయకుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కి సంబంధించిన ఓ ఆసక్తికర పరిణామం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తన టిక్కెట్ తదనంతర పరిణామాలపై ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన లాబీయింగ్ ను ఆర్కే నవ్వుతూ తిరస్కరించారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... గత కొంతకాలంగా వైసీపీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే 2019 - 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ తనకు తగినంత గుర్తింపు రాలేదనే విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే వైసీపీని వదిలి షర్మిల వైపు చూశారనే చర్చ జరిగిందని అంటారు!

వాస్తవానికి గతంలో జగన్ కు అత్యంత సన్నిహితులైన వారిలో ఆర్కే ఒకరనే చెప్పాలి. ఈ క్రమంలోనే 2014 - 19 మధ్య చంద్రబాబు పాలనలో అమరావతి పేరు చెప్పి తీవ్రమైన అవినీతి జరిగిందని చెబుతూ ఆయన కోర్టు మెట్లెక్కి పోరాడారు! అయితే.. అప్పట్లో తన పొరాటానికి పార్టీ నుంచి రావాల్సిన మద్దతు రాలేదనేది ఆర్కే అసంతృప్తి అని చెబుతారు!

ఏది ఏమైనా 2019 ఎన్నికల్లో అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ సాక్ష్యత్తు నారా లోకేష్ పై మంగళగిరి నియొజకవర్గం నుంచి సుమారు 5,337 ఓట్ల తేడాతో ఆర్కే విజయం సాధించారు. దీంతో.. జగన్ క్యాబినెట్ లో ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు కన్ఫాం అనే చర్చ జరిగింది. అయితే జగన్ ఏ దశలోనూ ఆర్కేకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు!

ఇదే సమయంలో... 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు సామాజికవర్గ సమీకరణల ప్రకారం మంగళగిరి టిక్కెట్ ఆర్కేకి ఇవ్వడంలేదనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఆ సమయంలో రెండు, మూడు పేర్లపై చర్చ నడించింది. దీంతో.. 2023 డిసెంబర్ 11న ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆర్కే రాజీనామా చేశారు.

వైసీపీలోని అంతర్గత రాజకీయాలే అందుకు కారణం అని చెప్పకనే చెప్పారు! అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జనవరి 21న జగన్ సోదరి వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చో ఏమో కానీ.. తిరిగి వైసీపీలో వచ్చేశారు!

కట్ చేస్తే... ఇటీవల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించిన వైసీపీ గుంటూరు జిల్లా నాయకుల సమావేశానికి హాజరయ్యారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ సమయంలో.. పార్టీలో గతంలోలాగా క్రియాశీల పాత్ర పోషించాలని ఆర్కేను వైవీ సుబ్బారెడ్డి కోరారని తెలుస్తోంది.

ఇదే సమయంలో.. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇప్పిస్తానని కూడా సుబ్బారెడ్డి.. ఆర్కేకు హామీ ఇచ్చారని.. ఇకపై మంగళగిరి నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరినట్లు తెలుస్తోంది. కాకపోతే.. పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో చోటుపై మాత్రం హామీ ఇవ్వలేనని వైవీ చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే... ఈ లాబీయింగ్ పై తనదైన శైలిలో నవ్వుతూ స్పందించిన ఆర్కే... సుబ్బరెడ్డి ఇచ్చిన ఆప్షన్స్ ను సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు. ఈ సందర్భంగా తనకు అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పారని సమాచారం. దీంతో.. వైవీ సుబ్బారెడ్డి మౌనంగా ఉండిపోయారని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఎంట్రీ ఉంటుందా.. లేక, మరో అభ్యర్థిపై దృష్టి పెడతారా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News