దిల్ రాజు డేట్స్ అడిగితే ఏ హీరో కూడా ఇవ్వడు!

నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.;

Update: 2025-05-30 09:28 GMT
దిల్ రాజు డేట్స్ అడిగితే ఏ హీరో కూడా ఇవ్వడు!

నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకునేందుకు థియేటర్ల బంద్ డ్రామా ఆడారని ఆరోపించారు. కుట్ర వెనుక అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సహా పలువురు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరోసారి రీసెంట్ గా ప్రెస్ మీట్ లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

"నేను ఇక్కడ ఉండట్లేదు.. ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్లిపోయా అని దిల్ రాజు అన్నారు.. ఇక్కడ సినిమాలు చేయను.. ఆ లెవెల్ కు వెళ్ళిపోయాను అన్నారు.. ఆయన ఆ రేంజ్ కు వెళ్లాలని ఎప్పుడూ కోరుకుంటా.. ఎందుకంటే నా తర్వాత ఆయన ఫీల్డ్ కు వచ్చారు.. హ్యాపీగా సూపర్ హిట్స్ అందుకున్నారు" అని నట్టి కుమార్ అన్నారు.

"వేల కోట్ల రూపాయలు సంపాదించారు. అది చాలా సంతోషం. కానీ దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్త వాళ్లతో సినిమాలు చేస్తా అన్నారు.. కానీ ఆయన అన్నదానికి.. బయట అనుకుంటున్న దానికి చాలా తేడా ఉంది. ట్రోల్స్ చూశారా? మీకు హీరోలు ఎవరూ డేట్స్ ఇవ్వడం లేదు.. అందుకే ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్లారా అని అంటున్నారు" అని తెలిపారు.

దిల్ రాజు గారు అడిగితే డేట్ ఇవ్వని హీరో ఇండస్ట్రీలో ఉన్నారా అని హోస్ట్ అడగ్గా.. అవును ఇప్పుడు ఎవరివ్వరు అని తెలిపారు నట్టి కుమార్. తాను పేర్లు చెప్పనని, ఆ అవసరం తనకు లేదని చెప్పారు. రూ.100 కోట్ల దాటిన హీరోల్లో ఎవరైనా డేట్స్ దిల్ రాజుకు ఈ మధ్య ఇచ్చి ఉన్నారని నట్టి కుమార్.. యాంకర్ కు క్వశ్చన్ చేశారు.

"రూ.100 కోట్ల దాటి బడ్జెట్ తో మైత్రీ, సితార సంస్ధలు నిర్మిస్తున్నాయి. ఒకప్పుడు ఎం ఎస్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు, అరవింద్ గారు, దిల్ రాజు గారు తీశారు. కానీ పెద్ద బడ్జెట్ ను మైత్రీ, సితార తట్టుకుంటున్నాయి. అందుకే తీస్తున్నాయి. సినిమాలను ఆపేయడంలో ఆ నలుగురు ఉన్నారని నేను చెప్పడం లేదు" అని వ్యాఖ్యానించారు.

"జూన్ 12న వీరమల్లు.. మే 30వ తేదీన భైరవం, ఖలేజా రీ రిలీజ్.. జూన్ 5న థగ్ లైఫ్ రిలీజులు ఉన్నాయని తెలుసు. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అని ప్రకటన వస్తే ఖండించకుండా ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తున్నారు? ఏపీ డిప్యూటీ పవన్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చాక.. మంత్రి దుర్గేష్ గారు వచ్చేదాకా స్పందించలేదు. అప్పటి వరకు ఏం చేశారు?" అని నట్టి కుమార్ ప్రశ్నించారు.

Tags:    

Similar News