బిచ్చగాడు డైరెక్ట‌ర్‌ తో వెంకీ

Update: 2016-08-06 15:30 GMT
బాగా లెక్క‌బెడితే వెంక‌టేష్‌ కోసం సిద్ధమైన క‌థ‌లు ఒక ప‌ది దాకా ఉండొచ్చు. సీనియ‌ర్ హీరోల్లో ఎవ‌రికోసమూ త‌యారు కాన‌న్ని క‌థ‌లు వెంకీకోసం స్క్రిప్టు రూపం దాలుస్తున్నాయి. వెంకీ కోసం క‌థ‌లు రాస్తున్నవాళ్లంతా కూడా యంగ్ డైరెక్ట‌ర్లే కావ‌డం ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ  విశేషం. బాబు బంగారం త‌ర్వాత నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు వెంకీ. ఆ చిత్రం త‌ర్వాత బోలెడ‌న్ని క‌థ‌లు లైన్లో ఉన్నాయి.

తాజాగా  బిచ్చ‌గాడు దర్శ‌కుడు శ‌శి కూడా వెంకీని దృష్టిలో ఉంచుకొని  ఓ కథ త‌యారు చేశాడ‌ట‌. కొన్ని రోజులుగా బిచ్చ‌గాడు హీరో విజ‌య్ ఆంటోనీ ద‌ర్శ‌క‌త్వంలోనే  వెంక‌టేష్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుగు ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. అస‌లు విష‌య‌మేంటంటే బిచ్చ‌గాడు ద‌ర్శ‌కుడు శ‌శి వెంకీకి క‌థ వినిపించ‌బోతున్నాడు.  త్వ‌ర‌లోనే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన వివ‌రాలు బ‌య‌టికి రాబోతున్నాయి. మామూలుగా అయితే బాబు బంగారం త‌ర్వాత వెంకటేష్  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు  పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల్సింది. కానీ పూరి క‌ళ్యాణ్‌రామ్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు.  ఆ త‌ర్వాత ఆయ‌న ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం చేయ‌బోతున్నాడ‌ట‌. అందుకే వెంకీ ఇత‌ర ద‌ర్శ‌కులు చెబుతున్న క‌థ‌ల్ని విని ఓకే చేస్తున్నాడు.
Tags:    

Similar News