టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య

Update: 2019-02-06 05:17 GMT
వర్ధమాన టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడడం టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకొని అఘాయిత్యానికి పాల్పడింది.

ఝాన్నీ ప్రస్తుతం మాటీవీలో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. నటిగా మంచి భవిష్యత్ తో ముందుకు దూసుకెళుతున్న సమయంలో ఆమె ఆత్మహత్య అందరినీ షాక్ కు గురిచేసింది.  ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం.

సూర్య అలియాస్ నానితో పరిచయం అయిన తర్వాత ఝాన్సీ  సీరియల్స్ మానేసిందని.. వివాహం చేసుకోమంటే అతడు ముఖం చాటేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమ, మోసంతోనే తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఝాన్సీ సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోగా ఆఫీసు నుంచి వచ్చిన ఆమె సోదరుడు చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సూర్య కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అవకాశాలు తగ్గిపోవడం.. సూర్యతో ప్రేమ వ్యవహారంలో విఫలమవడమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక మంగళవారం సూర్యతో ఝాన్సీకి గొడవ జరిగినట్టు కూడా ఆమె బంధువులు తెలుపుతున్నారు. మూడు నెలలుగా గొడవలకు విసిగి ఝాన్సీ సూసైడ్ చేసుకున్నటు చెబుతున్నారు. ఝాన్సీ స్వస్థలం కృష్నా జిల్లా ముదినేపల్లి మండలంలోని ఓ గ్రామం.
Tags:    

Similar News