ఎఫైర్ల గురించి స్వాతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Update: 2017-11-21 09:28 GMT
సినిమా హీరోయిన్లను జనాలు చూసే దృష్టి మారాలని అంటోంది అచ్చ తెలుగు కథానాయిక స్వాతి. సినీ రంగంలోకి ఎవరు వచ్చినా.. వాళ్ల క్యారెక్టర్ని చాలా తప్పుగా చూస్తారని.. ఇక అమ్మాయిల గురించి అయితే చెప్పాల్సిన పని లేదని స్వాతి అంది. తన విషయంలోనూ ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారని స్వాతి చెప్పింది. తాను ఎక్కువగా బయట కనిపించనని.. బయట తిరగనని.. కానీ తాను నటించిన చాలా మంది హీరోలతో తనకు ముడిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది స్వాతి.

మొట్టమొదటగా ‘డేంజర్’ సినిమా సమయంలో అల్లరి నరేష్ తో లింకు కలిపారని స్వాతి చెప్పింది. ఆ తర్వాత ‘అష్టాచెమ్మా’ టైంలో నానితో.. ‘స్వామి రారా’ టైంలో నిఖిల్ తో కూడా ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు సృష్టించారని.. తమిళంలో సినిమాలు చేసినపుడు అక్కడి మీడియా తనకు హీరో జైతో ఎఫైర్ ఉన్నట్లు రాసిందని స్వాతి చెప్పింది. ఇలాంటి వార్తలు రాసే ముందు.. తమకు ఫ్యామిలీ ఉంటుందని.. తాము కూడా బాధపడతామని ఆలోచించరా అని స్వాతి ప్రశ్నించింది. ఐతే మొదట్లో ఇలాంటి వాటికి బాధపడేదాన్నని.. తర్వాత లైట్ తీసుకోవడం అలవాటైందని ఆమె చెప్పింది. తాను హీరోయిన్ల లాగా కాదని.. సినిమా వేడుకలకు.. ఇతర కార్యక్రమాలకు హాజరు కానని స్వాతి అంది. తన పేరు వెనుక ఉన్న ‘కలర్స్’ అనే పదాన్ని జనాలు చాలా వరకు టీజ్ చేయడానికి ర్యాగింగ్ చేయడానికే ఉపయోగిస్తారని స్వాతి అంది. ఈ విషయాలన్నీ ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పింది స్వాతి. దానికి సంబంధించిన పూర్తి వీడియో త్వరలోనే రానుంది.
Tags:    

Similar News