ఇద్దరు బాహుబలులు ఒకచోట చేరితే

Update: 2016-10-27 17:10 GMT
బాహుబలి ఒక్కడే కదా.. అమరేంద్ర బాహుబలి-మహేంద్ర బాహుబలి అంటూ తండ్రికొడుకులుగా ఇద్దరు బాహుబలులు ఉన్నారని అనుకున్నా.. ఇద్దరూ ఒకచోట ఒకేసారి కనిపించరుగా అనిపించడం కామనే. కానీ ఇలా ఇద్దరు బాహుబలులు అంటూ లెక్క చెప్పిన వ్యక్తి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాబట్టి.. కరెక్టే అనుకోవాలి. ఇంతకూ ఈయన చెప్పిన ఆ ఇద్దరు ఎవరో తెలుసా.. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఒకరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. మరొకరు బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.

ప్రస్తుతం అమితాబ్ తో సర్కార్3 మూవీని తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ సెట్స్ దగ్గరకు టాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టేశారు. రీసెంట్ గా బాలయ్య ఈయనను కలవగా.. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా.. అదే సెట్స్ పై బిగ్ బీని  కలసి ముచ్చట్లు పెట్టుకున్నాడు.  'సర్కార్ సెట్స్ పై.. యాక్టింగ్ లో బాహుబలితో.. సినిమా మేకింగ్ లో బాహుబలి' అంటూ ట్వీట్ చేసిన వర్మ.. వారిద్దరు కలిసి నుంచుని మాట్లాడుకుంటున్న ఫోటోను కూడా ట్వీట్ చేశాడు.

ఒక్కోసారి విచిత్రంగా ట్వీట్స్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే వర్మ.. ఇలా పాజిటివ్ గా రియాక్ట్ కావడం విచిత్రమే కానీ.. తను చెప్పదలుచుకున్న పాయింట్ ని సింపుల్ గానే చెబుతూ.. హై ఎండ్ ఎమోషనల్ గా చెప్పడం విశేషం. అవనూ.. రాజమౌళి బిగ్ బీని ఎందుకు కలిశాడబ్బా? వీళ్లిద్దరూ అంత పర్సనల్ గా మాట్లాడుకునే సంగతి ఏమయుంటుందో కదా!
Tags:    

Similar News