హరిహర వీరమల్లు.. అప్పటివరకు పవన్ ఫ్యాన్స్ కు ఇక కష్టమే!

Update: 2023-01-30 06:00 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక వైపు వరుస సినిమాలతో.. మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇందులో మొఘ‌లుల కాలం నాటి బందిపోటు దొంగ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌బోతున్నారు. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో ఈ కథ సాగుతుందని సమాచారం. పీరియాడిక్ సినిమా కావ‌డంతోనే షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... ఇంకా నలభై శాతం షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది . ఇందులో రెండు పాటలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. టాకీ మొత్తం అయితేనే టీజర్ విడుదల చేస్తారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమను దసరాకు విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. మే నెల నాటికి టాకీ పూర్తయిపోతుందని, కొంచెం ఆలస్యమైనా పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ తీసుకున్నా దసరాకు పక్కా విడుదల పాజిబుల్ అనే ధీమాతో ఉన్నారు. పాన్ ఇండియ‌న్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ హరి హర వీర మల్లు... తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏ.ఎమ్ ర‌త్నం నిర్మిస్తున్నారు.
Read more!

ఇకపోతే పవన్ హరిహర వీరమల్లుతోపాటు ఇంకా పలు చిత్రాలు చేస్తున్నారు. వాటిలో తమిళ సూపర్ హిట్ సినిమా వినోదయసితం రీమేక్ చేస్తున్నారు. ఇందులో మెగా హీరో సాయి తేజ్ కూడా కనపడనన్నారు. దీనికి మాతృక కు దర్శకత్వం వహించిన సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ రచనలు అందిస్తున్నారు. ఇంకా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చేస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్. అంతేకాకుండా సాహో ఫిలిం డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్ స్టర్ మూవీ కూడా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా లెవెల్ లో రూపొందనుంది.

Similar News