ఎక్స్ క్లూసివ్ : పవన్ రావడం పక్కా!

Update: 2018-11-19 09:12 GMT
జనసేన కార్యకలాపాల్లో బిజీ అయిపోయి భవిష్యత్ రాజకీయల వైపు సీరియస్ గా అడుగులు వేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేయను అని అజ్ఞాతవాసి తర్వాత ప్రకటించిన సంగతి తెలిసిందే . అప్పటి నుంచి అభిమానులు బాగా నిరాశలో ఉన్నారు. తమ హీరో పార్టీ పరంగా ఇది తప్పక తీసుకోవాల్సిన నిర్ణయమే అయినప్పటికీ వెండితెరపై చూసే అవకాశం లేకుండా పోయిందే అని బాధ పడుతున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. వాళ్ళందరూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయే వార్త ఒకటి ఎక్స్ క్లూజివ్ గా అందింది.

అదే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ. పూర్తి స్థాయి హీరోగా కాదు కాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఓ మూవీలో 45 నిమిషాల పాటు వచ్చే పవర్ ఫుల్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు అనేదే లేటెస్ట్ అప్ డేట్. హీరోగా ఓ క్రేజీ యూత్ హీరో నటించే ఈ మూవీని ఎస్ ఆర్టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాం తాళ్ళూరి నిర్మించబోతున్నారు. రవితేజతో నేల టికెట్టు తీసిన నిర్మాత ఈయనే. ఇది ఎన్నికల కంటే ముందే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. దర్శకుడితో పాటు మిగిలిన టీం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పవన్ ఐడియాలజిని ప్రతిబింబించే విధంగా పాత్ర రూపకల్పన జరిగినట్టు వినికిడి. ఎన్నికలు మరో ఆరు నెలల లోపే ఉన్న నేపధ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా తక్కువ కాల్ షీట్స్ తోనే పవన్ తాలుకు షూటింగ్ పూర్తి చేసేలా బ్యాక్ గ్రౌండ్ ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వస్తాయి. ఇది పవన్ ఫ్యాన్స్ కి మెగా న్యూస్ అని చెప్పొచ్చు. ముప్పాతిక గంట అంటే చిన్న నిడివి కాదు. పవర్ ఫుల్ ఎపిసోడ్ కాబట్టి దాని ప్రభావం చాలా ఉంటుంది. అజ్ఞాతవాసి తర్వాత మళ్ళి సినిమాల్లో పవన్ కనిపిస్తాడా లేదా అనే సంశయానికి త్వరలోనే చెక్ పడబోతోందన్న మాట. ఇక మెయిన్ హీరో ఎవరు అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది
Tags:    

Similar News