పవన్ నీ దారెటు?

Update: 2018-01-20 05:14 GMT

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి రెండవ రోజుకే కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ అని తేలింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కడంతో మొదటి చాలా వరకు అందరు నమ్మకంతో హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ అంచనాలు అందుకోవడంలో త్రివిక్రమ్ కెరీర్ లో రెండవసారి డిజాస్టర్ అయ్యారు. అజ్ఞాతవాసి రిజల్ట్ ఇప్పుడు త్రివిక్రమ్ కెరీర్ కు అంత పెద్ద మైనస్ కాకపోవచ్చు గాని పవన్ కెరీర్ కు అయితే భారీ దెబ్బ కొట్టింది.

కరెక్ట్ గా పాలిటిక్స్ లోకి గట్టిగా అడుగుపెడుతున్న సమయంలోనే పరాజయం ఎదురవ్వడం ఆయనను సందిగ్ధంలో పడేసింది. ఇక అసలు విషయానికి వస్తే పవన్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ప్రముఖ నిర్మాత ఏఎమ్.రత్నంతో ఒక సినిమాను చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నారని రూ.5 కోట్ల వరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ సినిమాగురించి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేదు.

ఆక్సిజన్ రిలీజ్ సమయంలో పవన్ తో సినిమా తప్పకుండా ఉంటుందని రత్నం మీడియా సమావేశంలో గుర్తు చేశారు. కానీ అజ్ఞాతవాసి తరువాత పవన్ మైత్రి మూవీ మేకర్స్ తో కలవనున్నారు అనే టాక్ వచ్చింది. మొదట కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో కథను కూడా సెట్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ తోనే పవన్ కి మంచి హిట్ ఇప్పించాలని మైత్రి వారు ప్రయత్నాలు జరుపుతున్నారట. మరి ఏఎమ్.రత్నం ప్రాజెక్టు గురించి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News