కుమారి పెద్ద సాహసమే చేయబోతుందిగా..!

Update: 2020-01-27 04:55 GMT
తెలుగు ప్రేక్షకులకు కుమారి 21ఎఫ్‌ చిత్రంతో సుపరిచితం అయిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. ఆ చిత్రం తర్వాత ఈమె హీరోయిన్‌ గా బిజీ అయ్యింది. కాని అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు వరుసగా ఫ్లాప్స్‌ చవి చూడటంతో పాటు ఆమె చేసిన పాత్రలకు కుమారి స్థాయిలో దేనికి కూడా గుర్తింపు రాలేదు. కుమారితో వచ్చిన గుర్తింపుతో ఇంకా నెట్టుకు వచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్‌ కూడా రెడీ అయ్యింది.

అజయ్‌ భూయాన్‌ దర్శకత్వంలో క్రిష్‌ నిర్మాణంలో రూపొందబోతున్న ఒక వెబ్‌ సిరీస్‌ లో హెబ్బా పటేల్‌ సింగ్‌ గా నటిస్తోంది. తన పాత్ర కోసం ఈమె మొదటి సారి డబ్బింగ్‌ చెప్పుకోవడంతో పాటు ఏకంగా పాట కూడా పాడబోతుందట. వెబ్‌ సిరిస్‌ లో ఉండే పలు పాటలను ఈమెతో పాడించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు డబ్బింగ్‌ చెప్పుకునేందుకే చాలా కష్టపడ్డ ఈ అమ్మడు పాట పాడటం అంటే చాలా పెద్ద సాహసమే అని చెప్పాలి.

హీరోయిన్స్‌ పాటలు పాడటం అనేది మనం కామన్‌ గా చూస్తున్నాం. కాని హెబ్బా పటేల్‌ పాట పాడితే ఎలా ఉంటుందా అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిసున్న విషయం. ఈ వెబ్‌ సిరీస్‌ లో నవదీప్‌ తో పాటు ఇంకా బింధు మాధవి.. చాంధిని చౌదరి.. అక్షర గౌడ మరియు రాజాలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మొదటి సిరీస్‌ ఆసక్తికరమైన కథనాలతో ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. అతి త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫార్మ్‌ పై ఈ వెబ్‌ సిరీస్‌ ప్రసారం కాబోతుంది.
Tags:    

Similar News