లూసీఫర్‌ మిస్ అయినా మెగా ప్రయత్నాలు కంటిన్యూ

Update: 2021-06-20 08:30 GMT
మెగాస్టార్‌ కు వి వి వినాయక్ పై చాలా నమ్మకం ఉంటుంది. అందుకే ఆయనతో ఇప్పటికే ఠాగూర్‌ సినిమా తో పాటు ప్రతిష్టాత్మక ఖైదీ నెం.150 సినిమాను కూడా చేశాడు. ఆ సినిమా లు రెండు కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి. అందుకే ఆయన దర్శకత్వంలో మళ్లీ సినిమా లు చేసేందుకు చిరంజీవి ఓకే చెప్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. ఆ మద్య చిరంజీవి ఎంతో ఇష్టపడి చేయాలనుకున్న లూసీఫర్‌ రీమేక్ బాధ్యతలను వినాయక్‌ కు అప్పగించారనే వార్తలు వచ్చాయి.

లూసీఫర్‌ రీమేక్‌ స్క్రిప్ట్‌ విషయంలో చిరంజీవి ని వినాయక్ సంతృప్తి పర్చడంలో విఫలం అయ్యాడు. దాంతో ఆ సినిమా దర్శకత్వ బాధ్యత తమిళ దర్శకుడు మోహన్‌ రాజాకు చేరింది. ఈ సమయంలోనే వినాయక్ బాలీవుడ్‌ లో చత్రపతి సినిమాను రీమేక్ చేసేందుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సిద్దం అవుతున్నాడు. బెల్లంకొండ హిందీ సినిమా చేయడంతో పాటు మరో వైపు చిరంజీవితో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం అందుతోంది.

చిరంజీవి ని ఎలాగైనా ఒప్పించేందుకు పలు కథలను సిద్దం చేసుకుంటున్నాడట. కొన్ని రీమేక్‌ స్క్రిప్ట్‌ లను కూడా వినాయక్‌ తన టీమ్‌ తో రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి తో మళ్లీ ఒక సినిమా ను చేసి సక్సెస్ కొట్టి టాలీవుడ్‌ లో తన సత్తా చాటాలని వినాయక్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకప్పుడు స్టార్‌ హీరోలు వినాయక్‌ దర్శకత్వంలో నటించేందుకు చాలా ఇంట్రెస్ట్‌ తో ఉండే వారు. కాని ఇప్పుడు వినాయక్‌ పై నమ్మకం పెట్టాలంటే వెనుక ముందు ఆడుతున్నారు. అందుకే తనను అభిమానించే.. తాను అభిమానించే చిరంజీవితో సినిమాను చేయాలని వినాయక్‌ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. మరి ఆ ప్రయత్నం ఎంత వరకు సఫలం అయ్యేనో చూడాలి.
Tags:    

Similar News