వైరల్ అవుతున్న బిగ్ బి అమితాబ్ పోస్ట్..

Update: 2020-03-31 17:30 GMT
బిగ్ బి అమితాబ్ బచ్చన్ పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వలన ప్రతీ దేశంలో భారీ సంఖ్యలో మరణాలు పెరిగిపోతున్నాయి. దిక్కుతోచని పరిస్థితులలో భారత కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ విధించడం జరిగింది. కరోనా దెబ్బతో దేశంలోని రాష్ట్రాలన్నీ ఎక్కడికక్కడ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా సామాన్యుడి నుండి సెలబ్రిటీలు - రాజకీయ నేతలు అందరూ కూడా ఎవరి ఇళ్ళకి వారు పరిమితమయ్యారు.

అయితే, లాక్ డౌన్ వలన సత్ఫాలితాలు  వస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఇక కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రజలు తమ వంతు సహాయం అందించాలని కోరుతూ ప్రధాని మోడీ పీఎం కెర్స్ ఫండ్ ను ఏర్పాటు చేశారు.  తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసి ఆసక్తికర మెసేజ్ చేసారు. ''2020 సంవత్సరాన్ని మనం డిలీట్ చేద్దామా..? 2020 సంవత్సరాన్ని రీ ఇన్ స్టాల్ చేద్దామా ..? ఈ వెర్షన్ లో వైరస్ ఉంది . " అని బిగ్ బి మెసేజ్ చేసారు.  ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారి తెగ చక్కర్లు కొడుతుంది. ఈ పోస్ట్ పై  నెటిజన్లుకూడా బిగ్ బి చెప్పేది నిజమేనని కరోనా వైరస్ 2020 వెర్షన్ లో ఉందని కామెంట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News