‘రామాయణం’పై అల్లు సీరియస్సే

Update: 2017-05-28 10:15 GMT
మూడు వారాల కిందట అల్లు అరవింద్.. ఇద్దరు బాలీవుడ్ నిర్మాతలతో కలిసి రూ.500 కోట్ల బడ్జెట్ తో రామాయణ కథతో సినిమా తీయబోతున్నట్లు వార్తలు రాగానే అందరూ స్టన్ అయిపోయారు. ఇది వర్కవుటయ్యే ప్రాజెక్టేనా అని సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ప్రకటన తర్వాత అప్ డేట్స్ ఏమీ లేకపోవడంతో ఈ ప్రాజెక్టు కేవలం ప్రకటనకే పరిమితం అని... ఇది నిజంగా తెరకెక్కే అవకాశాలు లేవని ఊహాగానాలు వినిపించాయి.

ఐతే అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టు మీద సీరియస్ గానే ఉన్నట్లు మెగా కాంపౌండ్ నుంచి సమాచారం అందుతోంది. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటులు.. సాంకేతిక నిపుణులెవ్వరి పేర్లూ ఖరారవ్వని మాట వాస్తవమే కానీ.. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అయితే మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అరవింద్.. కొందరు రచయితలతో కలిసి స్వయంగా తనే అధ్యయనం చేయబోతున్నారట.

ఇందుకోసం ఆయన కొందరు పండితుల్ని కలవబోతున్నారట. ప్రవచనాలతో బాగా ఫేమస్ అయిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో పాటు సామవేదం షణ్ముఖ శర్మ.. గరికపాటి నరసింహారావు. పురాణపండ శ్రీనివాస్ లను అరవింద్ కలవబోతున్నారట. ‘రామాయణం’లో అందరికీ తెలిసిన కథ కాకుండా కొత్త విషయాలు ఏమున్నాయో.. వాటిని ఎలా వెండితెర మీదికి తీసుకురావచ్చో వీరి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారట అరవింద్. కొన్ని నెలల పాటు ఈ అధ్యయనం జరిగాక ఈ సినిమాకు స్క్రిప్టు పని మొదలవుతుందట. అప్పుడే దర్శకుడిని.. నటీనటుల్ని ఖరారు చేస్తారని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News