సమంతకు సిరాకు తెప్పేంచేశారుగా

Update: 2017-05-22 05:14 GMT
టాలీవుడ్ బ్యూటీ సమంత రీసెంట్ గా తిరుమల వెళ్లి శ్రీనివాసుని దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నా పెద్దా నటులు ఎవరు కనిపించినా.. తిరుమలలో ఉండే మీడియా హంగామా మామూలుగా ఉండదు. కెమేరాలు.. ఛానల్ మైకులతో నానా హంగామా చేసేస్తుంటారు. ఇక సమంత లాంటి స్టార్ హీరోయిన్ కనిపిస్తే ఊరుకుంటారా.. తెగ విసిగించి పారేశారు.

గుళ్లోకి వెళ్లేందుకు క్యూలో నుంచున్నప్పటి నుంచి సమంతపై కెమేరాలు ఫోకస్ చేస్తూనే ఉన్నారు. ఆలయంలోకి కెమేరాలకు అనుమతి లేదు కాబట్టి ఎంట్రన్స్ దగ్గరే కాపు కాసిన కెమేరామెన్.. ఆమె బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రతీ అడుగును కెమేరాల్లో బంధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆమెను చుట్టు ముట్టి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు. కానీ దైవ దర్శనం కోసం వచ్చిన సమంత.. చిన్న మాట కూడా మాట్లాడకుండా డిగ్నిటీ మెయింటెయిన్ చేసేందుకు గట్టిగానే ప్రయత్నించింది.

ఓసారి ఆగి ఫోటోలకు పోజ్ ఇచ్చి వెళ్లిపోతున్నా సరే వదలకుండా వెంటపడ్డారు మీడియా జనాలు. చివరకు విసుగు చెందిన సమంత.. ఎట్టకేలకు 'దర్శనం బాగా జరిగింది' అన్న ఒక్క ముక్క చెప్పి అక్కడి నుంచి తుర్రుమంది. ఈ మధ్యలో ఎంతగా ఎంతగా విసుకు చెందినా.. ఆ భావాలను మొహంలో దాచుకునేందుకు సమంత ఎంత కష్టపడిందో.. కెమేరాల్లో స్పష్టంగా కనిపించింది.
Full View
Tags:    

Similar News