బీహార్ ఎన్నికల్లో అదే కీ రోల్ పోషించిందా?
బీహార్ లోని భోజ్ పూర్ బెల్ట్ లో మహాఘఠ్ బంధన్ కు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గట్టి సవాలు విసురుతోంది. వాస్తవానికి భోజ్ పూర్ బెల్ట్ ను ఆర్జేడీకి బలమైన కోటగా భావిస్తారు. అయితే ఇప్పుడు లెక్కలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని 49 సీట్లలో 30 సీట్లలో ఎన్డీయే ముందంజలో ఉండగా.. మహాఘఠ్ బంధన్ 17 సీట్లలో ఆధిక్యంలో ఉంది! కాగా... 2020 ఎన్నికల్లో భోజ్ పూర్ బెల్ట్ లో మహాఘఠ్ బంధన్ ఆధిపత్యం చెలాయించింది.
వాస్తవానికి.. రాజధాని పాట్నాకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇందులో భాగంగా... ఎన్డీయేకు 27 సీట్లు, మహాఘఠ్ బంధన్ కు 21 సీట్లు వస్తాయని అంచనా వేశాయి.
భోజ్ పూర్ లో 57% కంటే ఎక్కువ పోలింగ్ నమోదు కాగా.. వృద్ధ ఓటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో... ఇటీవల నితీశ్ కుమార్ చేపట్టిన ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన కింద మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10,000 బదిలీ వ్యవహారం ఈ ఫలితాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.