నెరవేరుతోన్న అమిత్ షా జోస్యం!... పంచ పాండవులకే బీహార్ పట్టం!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) 160కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

దీంతో... అమిత్ షా జోస్యం నిజమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా... ఎన్డీయే 160 సీట్లు గెలుచుకుంటుందని.. మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షా చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. బీహార్ ప్రజలు ఎన్డీయే, బీజేపీతో ఉన్నారని తాను భావిస్తున్నానని.. దీన్ని ఐదుగురు పాండవుల పోరాటం అని తాను పిలుస్తానని.. ఎందుకంటే ఐదు రాజ్యాంగ పార్టీలు (జేడీయూ, బీజేపీ, ఎల్.జే.పీ, హెచ్.ఏ.ఎం, ఆర్.ఎల్.ఎం) ఎటువంటి వివాదం లేకుండా ఐక్యంగా ఉన్నాయని తెలిపారు.

Update: 2025-11-14 05:17 GMT

Linked news