అప్పుడే మొదలుపెట్టేసిన ఎన్డీయే కూటమి!:
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలవ్వగా... ఉదయం నుంచే ఆధిక్యంలో ఎన్డీయే తన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఇందులో భాగా... సుమారు 145 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా.. అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు.
మరోవైపు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ జేడీయూ పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా... మరోసారి నీతీశ్ ప్రభుత్వం రాబోతోందని, అందుకు బీహార్ సిద్ధంగా ఉందంటూ రాసుకొచ్చింది.
ఇదే సమయంలో గెలుపుపై ఆర్జేడీ సైతం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా... తామే గెలవనున్నామని, మార్పు రానుందని.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ విలేకరులతో అన్నారు.
కాగా... అధికార ఎన్డీయే కూటమే బీహార్ లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
Update: 2025-11-14 04:04 GMT