విపక్షంపై దాడి పెంచిన జగన్.. నరసాపురంలో అదిరిపోయే స్ఫీచ్!
ఈ నియోజకవర్గం పరిధిలోనే వైసీపీ రెబల్ నాయకుడు.. టీడీపీ నేత.. రఘురామకృష్ణరాజు.. ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 3 May 2024 10:34 AM GMTవైసీపీ అధినేత, సీఎం జగన్ విపక్షాలపై దాడిని ముమ్మరం చేశారు. ఒకవైపు విపక్షం.. యాంటీ ప్రచారం చేస్తూ.. పాజిటివిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జగన్.. విపక్షాలకు కౌంటర్లపై కౌంటర్లు ఇస్తూ.. అదిరిపోయేలా ప్రసంగిస్తున్నారు. తాజాగా ఆయన నరసాపురం పార్లమెంటు పరిధిలో పర్యటించారు. మేం సైతం సిద్ధం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ నియోజకవర్గం పరిధిలోనే వైసీపీ రెబల్ నాయకుడు.. టీడీపీ నేత.. రఘురామకృష్ణరాజు.. ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు.
జగన్ మాట్లాడుతూ.. ``కొందరు దుర్మార్గులు.. పార్టీల గొంతు కోసి.. ప్రతిపక్షాలతో చేతులు కలుపుతారు. మళ్లీ మేకతోలు కప్పుకొని.. ప్రజల మధ్యకు వచ్చి.. ఓట్లు అడుగుతారు`` అని పరోక్షంగా రఘురామపై విమర్శలు చేశారు. ఇదేసమయంలో చంద్రబాబు ఇస్తున్న హామీలను నమ్మొద్దని నేరుగా చెప్పుకొచ్చారు. ఒక్కటంటే ఒక్క హామీకూడా అమలు చేసే లక్షణం చంద్రబాబుకులేదన్నారు. అందుకే.. లెక్కకు మిక్కిలి హామీలు ఇచ్చి.. ప్రజలను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలను భయపెడుతున్నారని.. కానీ, ఇది ప్రజలు భయపడాల్సి చ ట్టం కాదని జగన్ చెప్పారు. ప్రజలకు మేలు చేసే చట్టమన్నారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలి సినా.. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. 2014-19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు ఇంటికి కిలో బంగారం ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు.