Begin typing your search above and press return to search.

ఆటగాళ్లకు రూ.2 కోట్లు.. టీమ్ ఇండియాకు రూ.30 కోట్లు లాస్

ముందునుంచి పోటీలో ఉండి.. కచ్చితంగా టైటిల్ కొట్టగలం అనుకున్న పరిస్థితుల్లో.. అనూహ్యంగా వెనుకబడి.. చివరకు ఫైనల్ కూడా చేరలేని పరిస్థితి.. దీంతో రూ.కోటి, రూ.2 కోట్లు కాదు. ఏకంగా రూ.30 కోట్లు చేజారిన పరిస్థితి.

By:  Tupaki Desk   |   16 May 2025 4:00 AM IST
India Misses WTC Final Loses Out on ₹30 Cr Prize Money and a Historic Chance
X

ముందునుంచి పోటీలో ఉండి.. కచ్చితంగా టైటిల్ కొట్టగలం అనుకున్న పరిస్థితుల్లో.. అనూహ్యంగా వెనుకబడి.. చివరకు ఫైనల్ కూడా చేరలేని పరిస్థితి.. దీంతో రూ.కోటి, రూ.2 కోట్లు కాదు. ఏకంగా రూ.30 కోట్లు చేజారిన పరిస్థితి. టి20లకు మహా ఆదరణ.. వన్డేలు ఎలాగూ జరగడం లేదు.. మరి సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే ఎలా..? అందుకే.. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)ని తీసుకొచ్చింది.

2019-21, 2021-23 రెండు సైకిల్స్ లోనూ టీమ్ ఇండియా ఫైనల్స్ కు చేరింది. తొలిసారి న్యూజిలాండ్, మలిసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది 2023-25 సైకిల్ లోనూ ఫైనల్ కు వచ్చేదే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3, ఆస్ట్రేలియాలో 1-3 తేడాతో సిరీస్ లను కోల్పోవడంతో టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఔట్ అయింది.

ఇక జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఫైనలిస్టులు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. తాజాగా ఐసీసీ డబ్ల్యూటీసీ ప్రైజ్ మనీ వివరాలు వెల్లడించింది.

డబ్ల్యూటీసీ విజేత జట్టుకు రూ.30.78 కోట్లు, రన్నరప్‌ నకు రూ.18.46 కోట్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ తెలిపింది. టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ జట్టుకు రూ.12.31 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ కు రూ.10.26 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తర్వాత స్థానాల్లోని ఇంగ్లాండ్‌ (రూ.8.2 కోట్లు), శ్రీలంక (రూ.7.18 కోట్లు) బంగ్లాదేశ్‌ (రూ.6.15 కోట్లు), వెస్టిండీస్‌ (రూ.5.13 కోట్లు), పాకిస్థాన్‌లకు (రూ.4.10 కోట్లు) ఇవ్వనున్నారు. ఈ లెక్కన మొత్తం ప్రైజ్ మనీ రూ.49.27 కోట్లు.

2021-23 డబ్ల్యూటీసీ సైకిల్ విజేత (ఆస్ట్రేలియా)కు రూ.13.23 కోట్లు మాత్రమే ఇచ్చారు. రన్నరప్ (భారత్)కు దక్కింది రూ.6.61 కోట్లు మాత్రమే. ఈ సారి మాత్రం ప్రైజ్ మనీ మూడింతలు పెంచేశారు.

నాలుగోస్థానంలో నిలిచినందుకు టీమ్ ఇండియాకు రూ.12.31 కోట్లు ఇస్తున్నా.. విజేతగా నిలిచి ఉంటే రూ.30 కోట్లు దక్కేవి. ఇక్కడ రూ.18 కోట్లు పోయాయి అనుకున్నా.. ఒకవేళ తొలిసారి చాంపియన్ అయి ఉంటే బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వ నజరానాలు రూ.కోట్లలో దక్కి ఉండేవి. ఆ లెక్కన చూసుకున్నా రూ.15 కోట్లు నష్టపోయినట్లే.