ఆపరేషన్ సిందూర్..పాక్ బౌలౌట్..క్రికెట్ మ్యాచ్ క్లిప్ తో బీజేపీ బంతాట
ఇప్పుడు 2007 టి20 ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ ను.. పెహల్గాం దాడుల అనంతరం పాకిస్థాన్ పైన భారత్ చేపట్టిన యుద్ధంతో పోలుస్తూ బీజేపీ ఓ వీడియో విడుదల చేసింది.
By: Tupaki Desk | 16 May 2025 1:02 PM ISTఇప్పుడంటే టి20 క్రికెట్ లో మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తున్నారు. కానీ, మొదట్లో ఈ పద్ధతి లేదు. టి20లు మొదలైన తొలినాళ్లలో మ్యాచ్ టై అయితే ’బౌలౌట్’ పద్ధతిని పాటించేవారు. అంటే.. రెండు జట్ల బ్యాట్స్ మెన్ లేకుండా ఒక ఓవర్ పాటు బౌలింగ్ చేస్తాయి. వికెట్ల వెనుక కీపర్ ఉంటాడు. ఒక్కో బౌలర్ ఒక బంతి వేస్తాడు. మూడుసార్లు వికెట్లు పడగొట్టిన జట్టును విజేతగా ప్రకటిస్తారు అన్నమాట.
బౌలౌట్.. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచ కప్ లో బాగా పాపులర్ అయింది. కారణం ఆ టోర్నీలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ టై కావడంతో బౌలౌట్ నిర్వహించారు. ఈ మ్యాచ్.. భారత కెప్టెన్ ధోనీ తెలివితేటలకు పాక్ కెప్టెన్ షోయబ్ మాలిక్ దద్దమ్మతనానికి ప్రతీకగా నిలిచింది. ఎందుకంటే ధోనీ పూర్తిగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి వికెట్లు పడగొట్టగా.. మాలిక్ పేస్-స్పిన్ తో బౌలింగ్ చేయించి ఫెయిలయ్యాడు. అంతకుముందు భారత్ 141 పరుగులు చేయగా.. పాక్ కూడా సరిగ్గా అన్నే పరుగులు చేయడంతో టై అయింది.
మిస్సైళ్లయినా.. బంతులైనా
ఇప్పుడు 2007 టి20 ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ ను.. పెహల్గాం దాడుల అనంతరం పాకిస్థాన్ పైన భారత్ చేపట్టిన యుద్ధంతో పోలుస్తూ బీజేపీ ఓ వీడియో విడుదల చేసింది.
2007 నాటి మ్యాచ్ లో పాక్ పై భారత్ గెలిచిన విధానాన్ని పోలుస్తూ.. ఆపరేషన్ సిందూర్ అచ్చం ఇలానే సాగిందంటూ ట్వీట్ చేసింది. ఆ బౌలట్ వీడియో చూస్తే భారత బౌలర్లు వరుసగా మూడుసార్లు వికెట్లను పడగొట్టారు.. పాక్ బౌలర్లు మాత్రం ఒక్క వికెట్ కూ గురిచూసి కొట్టలేకపోయారు. సరిగ్గా ఇలానే.. ఆపరేషన్ సిందూర్ తో భారత్ గురిచూసి పాక్ ను కొట్టగా.. పాక్ మాత్రం ఫెయిల్ అయిందంటూ బీజేపీ ట్వీట్ చేసింది.
ఇక 2007 ప్రపంచ కప్ నాటి మ్యాచ్ లో కెప్టెన్ గానే కాదు.. వికెట్ల వెనుక ధోనీ వ్యూహ రచనను చెప్పుకోవాలి.
ఎందుకంటే సరిగ్గా వికెట్ల వెనుక కూర్చున్న ధోనీ.. బౌలర్ వికెట్ కు గురిచూసి కొట్టేలా దిశానిర్దేశం చేశాడు. మరి అదే పాక్ కీపర్ కాస్త కమ్రాన్ అక్మల్ మాత్ర కాస్త పక్కగా నిల్చున్నాడు. దీంతో బౌలర్ కూ సరైన నిర్దేశం చేయలేకపోయాడు.
భారత్ తరఫున పార్ట్ టైమ్ స్పిన్నర్ వీరేంద్ర సెహ్వాగ్, అసలు ఎపుడూ బౌలింగే చేయని రాబిన్ ఊతప్ప, మేటి ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ లు బంతితో వికెట్లను గిరాటేశారు.
పాకిస్థాన్ తరఫున మాత్రం పేసర్లు యాసిర్ అరాఫత్, ఉమర్ గుల్, పేసరో స్పిన్నరో అర్థంకాని షాహిద్ అఫ్రిదిలతో బౌలింగ్ చేయించి భంగపడింది.