Begin typing your search above and press return to search.

సింధూరం తీసేనోళ్లను ప్రకృతిని వదలట్లేదుగా?

బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టటం ఇదే అనుకోవచ్చు కొందరు. కానీ.. సున్నితంగా చూసినప్పుడు అందులో నిజం లేకపోలేదుగా? అనిపించక మానదు.

By:  Tupaki Desk   |   16 May 2025 10:41 AM IST
Pakistan And turkey Straggle Earthquakes
X

బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టటం ఇదే అనుకోవచ్చు కొందరు. కానీ.. సున్నితంగా చూసినప్పుడు అందులో నిజం లేకపోలేదుగా? అనిపించక మానదు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పుడు.. వాటిని వదిలేసి.. పాకిస్తాన్.. దానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే టర్కీ అలియాస్ తుర్కియాలకు వరుస పెట్టి ప్రకృతి పెడుతున్న పరీక్షలు ఇప్పుడు చర్చగా మారాయి. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న భారీ భూకంపాలతో పాక్. టర్కీలు కిందా మీదా పడుతున్నాయి.

మూడు రోజుల క్రితం దాయాది పాకిస్తాన్ లో భూకంపం చోటు చేసుకుంది. వారం వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనల కారణంగా ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అకారణంగా భారత్ లోని ఉగ్రదాడికి తన వంతు సహాయ సహకారాల్ని పాక్ అందించిందనటంలో సందేహం లేదు. వారు చేసే అరాచకాలకు.. అమాయకుల ప్రాణాల్ని ఎలాంటి దయ.. మానవత్వం అన్నది లేకుండా అమాయక ప్రజల్నివారి కుటుంబ సభ్యుల ఎదుట పిట్టల్నికాల్చినట్లుగా కాల్చేసిన వైనం వారి గుండెల్ని పగిలేలా చేశాయి. వారి వేదన.. శాపనార్థాల్ని ఎవరు విన్నా.. వినకుండా ప్రకృతి విని ఉన్నట్లుగా కనిపిస్తోంది.

మొదటి భూకంపం మే 5న రాగా.. రెండోది మే 10న చోటు చేసుకుంది. పాక్ లో భూకంపం చోటు చేసుకోవగా.. మే 12న కూడా పాక్ లో భూకంపం వచ్చింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 4.06గా వెల్లడించారు. ఈ భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలతో పరుగులు తీసినట్లుగా వార్తా సంస్థలు వెల్లడించాయి. పాక్ పాలకుల అరాచకాలకు ప్రకృతి సైతం స్పందించిందనన వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. అనూహ్య రీతిలో పాకిస్తాన్ కు గుడ్డిగా సపోర్టు చేస్తూ.. భారత్ కు దూరంగా ఉండటం.. తప్పుడు ప్రచారాలు చేసుకోవటం లాంటివి టర్కీ పాలకుల్లో కనిపిస్తాయి. పహల్గాం ఉగ్రవాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తే.. తుర్కియా (టర్కీ) అందుకు భిన్నంగా వ్యవహరించింది. అన్నింటికి మించిన ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ దుర్మార్గాలకు.. దుర్నీతికి.. అధర్మాలకు తోడుగా.. భారత్ మీద విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడిన పాక్ కు సపోర్టు ఇవ్వటం ద్వారా తుర్కియో దాయాది చేసిన పాపాల్లో తాను వాటా తీసుకుందని చెప్పాలి.

అందుకే కాబోలు ఇప్పటికే మూడుసార్లు భూకంప తీవ్రత పాకిస్తాన్ కు చూపించిన ప్రకృతి.. ఇప్పుడు టర్కీ మీద ఫోకస్ చేసిందా? అన్న ప్రశ్నతలెత్తేలా చేస్తోంది. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి వేళలో భూకంపం సడన్ గా చోటు చేసుకోవటం.. ఈ తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.2గా చెబుతున్నారు. భూకంపం ధాటికి ఆ దేశంలో పలు భవనాలు నేలకూలినట్లుగా వార్తలు వస్తున్నాయి.

టర్కీ సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్సులో ఈ భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ భూకంపం ధాటికి ఇస్తాంబుల్.. అంకారాలతో పాటు ఇతర ప్రాంతాల్ని కుదిపేసింది. 1.6 కోట్ల జనాభా ఉన్న ఇస్తాంబుల్. అంకారాలతో పాటు పలు ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతున్నాయి.భూకంపం ధాటికి ఆ దేశం తీవ్రంగా నస్టపోయినట్లుగా చెబుతున్నారు. పలు చోట్ల ఆ దేశ ప్రజలు భయాందోళనలతో పరుగులు తీసినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన ప్రాణ నష్టం.. ఆస్తి నష్టాన్ని పక్కన పెడితే.. భారతీయుల్లో చాలామంది టర్కీలో తాజాగా ఎదుర్కొంటున్న పరిణామాలు కచ్ఛితంగా భూమాతను ఇబ్బందికి గురి చేసి ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తంగా పాక్ చేసి పాపాలకు అండగా నిలిచిన టర్కీ అలియాస్ తర్కియాకు ప్రకృతి సరైన రీతిలో సమాదానం ఇచ్చినట్లుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.