Begin typing your search above and press return to search.

పాక్ ఉప ప్రధాని నవ్వులపాలు... కన్ఫాం చేసుకోకుండా కమిట్ అయితే అంతే!

దీనికి ప్రూఫ్ ఉందా అని అడిగిన యాంకర్ ప్రశ్నకు సమాధానంగా... సోషల్ మీడియాలో అలా ప్రచారం జరుగుతుంది అని చెప్పి కార్టూన్ అయిపోయారు

By:  Tupaki Desk   |   16 May 2025 3:05 PM IST
పాక్  ఉప ప్రధాని నవ్వులపాలు... కన్ఫాం చేసుకోకుండా కమిట్  అయితే అంతే!
X

ఇటీవల అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన పాకిస్థాన్ రక్షణ మంత్రి... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కు చెందిన ఫైటర్ జెట్ లను తమ సైన్యం కూల్చేసిందని చెప్పుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రూఫ్ ఉందా అని అడిగిన యాంకర్ ప్రశ్నకు సమాధానంగా... సోషల్ మీడియాలో అలా ప్రచారం జరుగుతుంది అని చెప్పి కార్టూన్ అయిపోయారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ ఉప ప్రధాని, ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ నవ్వులపాలయ్యారు. ఆన్ లైన్ లో పబ్లిష్ అయ్యిందని చెప్పుకున్న ఓ మీడియా కథనాన్ని పార్లమెంట్ లో చదివి వినిపించారు. ఆ కథనంలో... పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ను విదేశీ మీడియా ప్రశంసించిందని ఉండటంతో.. ఉత్సహంతో దార్ చెలరేగిపోయారు. అయితే.. అది ఫేక్ న్యూస్ అని తెలియడంతో కార్టూన్ అయిపోయారు!

అవును... భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ కు ముచ్చెమటలు పట్టేసిన సంగతి తెలిసిందే. మోడీ చెప్పినట్లు ఆ వార్ లో పాక్ ఏ ఒక్క రౌండ్ లోనూ గెలవలేదనే చెప్పుకోవాలి. అలాంటి పాకిస్థాన్ గురించి అంతర్జాతీయ మీడియా సంస్థలు తెగ పొగిడాయని ఒక కథనం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... బ్రిటన్ కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ ఓ కథనాన్ని ప్రచురించినట్లు ప్రచారం జరిగింది.

ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసిస్తూ ఆ కథనం కనిపించిందంట. దీంతో... గగనతల రారాజు పాక్ ఎయిర్ ఫోర్స్ అని విదేశీ మీడియా కీర్తించిందంటూ ఇషాక్ దార్ భ్రమపడ్డారు.. అనంతరం ఆ వార్తను నేరుగా పార్లమెంట్ లో చదివి వినిపించారు. కట్ చేస్తే అది ఫేక్ అని తేలింది.

అసలు డైలీ టెలిగ్రాఫ్ ఆ హెడ్ లైన్ తో ఎలాంటి కథనం ప్రచురించలేదు. పాకిస్థానీయులే ఏఐ తో తప్పుడు వార్తను సృష్టించి, ఆత్మవంచన చేసుకుంటున్నారు! అయితే.. అది నేరుగా పాక్ ఉప ప్రధానే నిజమని నమ్మి, పార్లమెంట్ లో చదివి వినిపించారు. ఈ సమయంలో తాము అలాంటి హెడ్ లైన్ ఏదీ పెట్టలేదని డైలీ టెలిగ్రాఫ్ స్పష్టం చేసింది.

ఇదే సమయంలో... పాకిస్థాన్ దేశ మీడియా సంస్థ డాన్ న్యూస్ సైతం ఇదే విషయాన్ని తెలిపింది.. పాకిస్థాన్ పార్లమెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. ది డైలీ టెలిగ్రఫ్ అలాంటి కథనాలను ఎప్పూడూ ప్రచురించలేదని తేల్చింది. దీంతో... పాక్ ప్రధానిపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఓయ్... కాస్త చూసుకోబడ్లే... అంటూ కామెంట్ చేస్తున్నారు. కార్టూన్లు అయిపోవడం పాక్ నేతలకు కొత్తేమీ కాదని స్పందిస్తున్నారు!