Begin typing your search above and press return to search.

పాక్ లో బ్రహ్మోస్... పాత సామెత గుర్తు చేసిన రాజ్ నాథ్!

ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అని.. పాక్ కు భారత్ దెబ్బేమిటో చూపించామని.. ఈ ఆపరేషన్ లో భాగంగా... 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా..

By:  Tupaki Desk   |   16 May 2025 2:13 PM IST
Operation Sindoor a Grand Success India Sends Strong Message to Pakistan
X

ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అని.. పాక్ కు భారత్ దెబ్బేమిటో చూపించామని.. ఈ ఆపరేషన్ లో భాగంగా... 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. 30 - 40 మంది పాక్ సైనికులు మృతి చెంది ఉంటారని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో భారత్ పై దాడికి పాక్ విశ్వప్రయత్నాలు చేసినా.. అవేవీ సక్సెస్ కాలేదని సైన్యం తెలిపింది.

ఈ సమయంలో ప్రస్తుతం భారత్ - పాక్ ల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ అంగీకారం ఈ నెల 18వరకూ కొనసాగనుందని అంటున్నారు. ఈ సమయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. గుజరాత్ లోని భూజ్ వైమానిక దళ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సైన్యంతో మాట్లాడారు. ఈ క్రమంలో పాక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... భుజ్ ఎయిర్ బేస్ ను సందర్శించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడ సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... భారత బ్రహ్మోస్ క్షిపణి శక్తిని పాకిస్థాన్ కూడా ఇప్పుడు అంగీకరించిందని.. భారత్ లో తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్ కు పట్టపగలు చుక్కలు చూపించిన సామెతను గుర్తుకు తెచ్చిందని అన్నారు.

ఈ సమయంలో రాజ్ నాథ్ తో పాటు ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపీ సింగ్ కూడా ఉన్నారు. అక్కడ వీరిరువురూ అధికారులతో సంభాషించారు. ఇదే సమయంలో.. ఆపరేషన్ తర్వాత ప్రిపరేషన్ గురించి సమీక్షించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన ఏపీ సింగ్... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానికి దళం అత్యంత వేగంగా స్పందించిందని ప్రశంసించారు.

ఈ సందర్భంగా... ఆపరేషన్ సిందూరు సమయంలో భారత వైమానిక దళం చేసినంది దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా.. భారతీయులంతా గర్వపడేలా చేసిందని.. పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి భారత వైమానిక దళానికి కేవలం 23 నిమిషాలు సరిపోతాయని చూపించామని అన్నారు. ఈ సందర్భంగా సైన్యాన్ని కొనియాడారు.

ఇదే సమయంలో... 1965 భారత్ - పాక్ యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ.. నాడు ఈ భుజ్ పాత్ర చాలా కీలకంగా ఉందని అన్నారు. నాడు పాక్ పై మనం సాధించిన ఘన విజయానికి భూజ్ సాక్షిగా నిలిచిందని.. ఇప్పుడు మళ్లీ పాక్ పై విజయానికి అది సాక్షిగా నిలిచిందని.. ఇది ఇక్కడ ఉండటం చాలా గర్వంగా ఉందని అన్నారు.

ఐఎంఎఫ్ నిధులు అధికంగా ఉగ్రవాదుల కోసమే!:

ఇదే సమయంలో... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ నాశనం చేసిన ఉగ్రవాద నెట్ వర్క్ ను పాకిస్థాన్ పునర్నించడానికి ప్రయత్నిస్తోందని చెప్పిన రాజ్ నాథ్... ఆ దేశానికి తాజా బెయిలౌట్ ప్యాకేజీని పునరాలోచించాలని అంటర్జాతీయ ద్రవ్య నిధిని కోరారు. ఐఎంఎఫ్ రుణంలో మెజరిటీ భాగాన్ని ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించనుందని అన్నారు!

ప్రధానంగా... బహవల్పూర్, మురిద్కే లలో ఉన్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నించడానికి పాక్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించిందని.. ఐఎంఎఫ్ నుంచి వచ్చే నిధుల్లో గణనీయమైన భాగం ఖచ్చితంగా ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయలాకు నిధులు సమకూర్చడానికే ఉపయోగిస్తుందని తెలిపారు.

బ్రహ్మోస్ కంటే చైనా రక్షణ వ్యవస్థ బలహీనం!:

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా... పాక్ ప్రయోగించిన చైనా మేడ్ క్షిపణులను భారత్ నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అమెరికన్ అర్బన్ వార్ ఫేర్ నిపుణుడు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. తాజాగా పాక్ పై భారత్.. అటు దాడిలోనూ, ఇటు రక్షణాత్మక వ్యూహంలోనూ ఆదిపత్యాన్ని ప్రదర్శించిందని.. పాక్ పై ఎప్పుడైనా, ఎక్కడైనా దాడి చేయగలమనే సందేశాన్ని పంపిందని అన్నారు.

తాజాగా ప్రముఖ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన కల్నల్ (రిటైర్డ్) జాన్ స్పెన్సర్... పాకిస్థాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు.. భారత్ యొక్క బ్రహ్మోస్ క్షిపణులకు సరిపోలడం లేదని అన్నారు. పాక్ అంతటా దాడి చేయడంతో పాటు, పాక్ డ్రోన్ దాడులు, క్షిపణులను ఎదుర్కోవడంలో సహా తనను తాను విజయవంతంగా రక్షించుకోవడంలో భారత్ సక్సెస్ అయ్యిందని అన్నారు.