Begin typing your search above and press return to search.

పాక్ కి షాక్ ఇచ్చేలా పక్కలో బల్లెం ని తెస్తున్న భారత్

గత నెల రోజున నుంచి భారత్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. పాక్ ని పూర్తిగా దెబ్బ తీయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది.

By:  Tupaki Desk   |   16 May 2025 11:04 AM IST
పాక్ కి షాక్ ఇచ్చేలా పక్కలో బల్లెం ని తెస్తున్న భారత్
X

గత నెల రోజున నుంచి భారత్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. పాక్ ని పూర్తిగా దెబ్బ తీయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. అది ఇపుడే జరగాలని కోరుకుంటోంది. ఎందుకంటే భారత్ ఎదుగుదలకు అవరోధానికి పాక్ దుష్ట చర్యలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి.

ఇన్నాళ్ళూ పాక్ చేసిన దాష్టికాలు భారత్ మీద అదే పనిగా వదిలిన ఉగ్ర భూతాలతో దేశం భారీ కష్టాలను నష్టాలను చవి చూసింది. ఇక వాటికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా భారత్ ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. భారత్ తలచుకుంటే కాల్పుల విరమణ కాకుండా పూర్తి స్థాయి యుద్ధానికి దిగి పాక్ పీచమణచగలదు.

కానీ దాని వల్ల భారత్ కూడా భారీగా దెబ్బ తింటుంది. అందుకే అన్ని రకాలుగా దారులు వెతుకుతూ మెల్లగా పాక్ ని మూసేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సింధు నదీ జలాలను ఆపేసి పాక్ లోని సగం భూభాగాన్ని ఏడారి చేసిన భారత్ వాణిజ్య ఒప్పందాలు అన్నింటికీ స్వస్తి చెప్పింది. పాక్ పౌరులకు వీసాలను రద్దు చేసింది. పాక్ లోని అణు బాంబులు స్వాధీనం చేసుకోవాలని ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి విన్నపం చేసిన భారత్ పాక్ లోని లక్ష్కరే తోయిబా అనుబంధంగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద జాబితాలో చేర్చాలని కోరుతోంది.

ఇపుడు ఇది చాలదన్నట్లుగా తాలిబన్లను పాక్ మీదకు ఎగదోసే వ్యూహానికి పదును పెడుతోంది. ఒకనాడు ఇదే తాలిబన్లను పెంచి పోషించి భారత్ లో ఉగ్రవాదానికి పాక్ వాడుకుంది. అయితే ఆఫ్ఘాన్ ని హస్తగతం చేసుకున్నాక తాలిబన్లకు మెల్లగా పాక్ గుట్టు తెలిసి వచ్చింది. అది తమ పాలిట భస్మాసుర హస్తం అని కూడా ఆలోచించి దూరంగా ఉంటోంది. పాక్ భారత్ ల మధ్య యుద్ధం వచ్చినా పాక్ కి మద్దతు ఇచ్చే ఆలోచనలో తాలిబన్లు లేరు. పైగా పాక్ భరతం పట్టాలనే అదను కోసం చూస్తున్నారు.

దాంతో చరిత్రలో మొదటిసారిగా భారత్ తాలిబన్లకు ఫోన్ కలిపింది. 2021లో తాలిబన్ రాజ్యం ఏర్పడ్డాక్ దాని పాలనను ప్రపంచంలో గుర్తిస్తున్నది భారతదేశం మాత్రమే. గడచిన నాలుగేళ్ళలో తాలిబన్లు భారత్ పట్ల సానుకూల ధోరణితో ఉంటున్నారు. ఇపుడు దానిని ఉపయోగించుకుని చాణక్య రాజకీయానికి భారత్ దిగుతోంది.

అందుకే కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ తాలిబన్ విదేశాంగ మంత్రితో ఫోన్ కలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబ‌న్ ప్ర‌భుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో భార‌త విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఎస్ జైశంక‌ర్ ఫోన్‌లో చ‌ర్చ‌లు జ‌రిపడం కీలకమైన పరిణామంగ ఆంతా చూస్తున్నారు. ఎందుకంటే భార‌త్‌ పాకిస్థాన్ ల మ‌ధ్య ప్రస్తుతం ఉద్రిక్త‌త‌లు కొనసాగుతున్నాయి.

దాంతో భారత్ ముల్లుని ముల్లుతోనే తీయాలన్న కొత్త సిద్ధాంతానికి రెడీ అవుతోంది. ఏ తాలిబన్లను అయితే ఉపయోగించుకుని భారత్ ని ఒకనాడు పాక్ ఇబ్బంది పెట్టిందో ఆ తాలిబన్లతోనే పాక్ కి చెక్ చెప్పాలని చూస్తోంది అని అంటున్నారు. అందుకే జై శంకర్ ఫోన్ కలిపారు అని అంటున్నారు.

ఇక ఈ ఫోన్ సంభాషణల సందర్భంగా భారత్ లో పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలు ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిని తాలిబ‌న్లు ఖండించ‌డాన్ని జైశంక‌ర్ స్వాగ‌తించారు. తాలిబ‌న్ల‌తో తాను మాట్లాడిన విష‌యాన్ని మంత్రి జైశంక‌ర్ ఎక్స్

ద్వారా వెల్ల‌డించారు. అంటే పాక్ కి పక్కలో బల్లెం ని దించే ఎత్తుగడ స్టార్ట్ అయింది అన్న మాట. తాలిబన్లు భారత్ లో ఇపుడు మంచిగా ఉంటున్న వేళ పాక్ కి రెండు వైపులా మద్దెల దరువుకు రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు.

ఇక చూస్తే కనుక తాలిబ‌న్ ప్ర‌భుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. రానున్న రోజులలో తాలిబన్లతో భారత్ కలసి మరిన్ని అడుగులు వేయడం ద్వారా పాక్ ఆట కట్టిస్తుంది అని అంటున్నారు. మొత్తానికి భారత్ తన దౌత్య రాజకీయంలో సరికొత్త పావులనే కదుపుతోంది. ఇది గతంలో ఎన్నడూ చూడనిదిగా కూడా ఉందని అంటున్నారు. భారత్ తో పెట్టుకుంటే పాక్ కి దబిడ దిబిడే అన్నది చాలా తొందరలోనే దాయాదికి అర్ధం అవుతుందని అంటున్నారు.