Begin typing your search above and press return to search.

మే 9-10 న పాక్ కు భారత్ ఎలా ఎర వేసి, కొట్టిందో తెలుసా?

ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా అంటూ మే 6-7 తేదీల్లో భారత్ పైకి వందల కొద్దీ తుర్కియే డ్రోన్లను పాకిస్థాన్ పంపించిన సంగతి తెలిసిందే!

By:  Tupaki Desk   |   16 May 2025 12:45 PM IST
మే 9-10 న పాక్ కు భారత్ ఎలా ఎర వేసి, కొట్టిందో తెలుసా?
X

ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా అంటూ మే 6-7 తేదీల్లో భారత్ పైకి వందల కొద్దీ తుర్కియే డ్రోన్లను పాకిస్థాన్ పంపించిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో... భారత్ గగనతల రక్షణ వ్యవస్థలను గుర్తించి వాటిని ధ్వంసం చేయాలని భావించింది. అయితే... భారతదేశ బలమైన ఎయిర్ డిఫెన్స్ పాక్ వ్యూహాన్ని చిత్తు చేసింది. ఈ సమయంలో మే 10న భారత్ వ్యూహాత్మకంగా ముందుకు కదిలింది.. పాక్ ను వణికించేసింది.

అవును... మే 9-10 తేదీ రాత్రి వేళల్లో భారత్ లోని పౌర నివాసాలు, స్కూళ్లు, హాస్పటల్స్, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొన్న పాక్.. డ్రోన్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసింది. దీంతో... పాకిస్థాన్ కీలక స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. ఈ సమయంలో పాక్ వద్ద ఉన్న హెచ్.క్యూ-9 గగనతల రక్షణ వ్యవస్థ అడ్డంకిగా మారిందని గుర్తించింది.. వెంటనే తన డికాయ్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది.

ఇందులో భాగంగా... వాయుసేన ఫైటర్ జెట్లను తలపించేలా సంకేతాలు పంపే కొన్ని రకాల డ్రోన్ లను గాల్లోకి వదిలింది భారత్. దీంతో... భారత్ ఫైటర్ జెట్లు దొరికేశాయంటూ పాకిస్థాన్ హెచ్.క్యు-9, సహా ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. దీంతో.. వీటిని మొహరించిన ప్రదేశాలను గుర్తించిన భారత్.. ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది.. పాక్ రాడార్ వ్యవస్థను దెబ్బతీసింది.

ఈ సమయంలో భారత్ పశ్చిమ కమాండ్ల నుంచి బ్రహ్మోస్ సహా స్కాల్ఫ్, ర్యాపేజ్, క్రిస్టల్ మేజ్ వంటి ఆయుధాలు ప్రయోగించి.. నిరాటంకంగా పాక్ ఎయిర్ బేస్ లపైకి దూసుకెళ్లాయి. ఈ సమయంలో... బలమైన షెల్టర్లు, కమాండ్ సెంటర్లు, రన్ వే లను దెబ్బతీసేపనిని బ్రహ్మోస్ చూసుకొందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో.. పాక్ లోని 12 కీలక ఎయిర్ బేసుల్లో 11ను భారత్ దెబ్బతీసిందని పేర్కొంది!

కాగా... క్రిస్టల్ మేజ్ అనేవి ఇజ్రాయెల్ కు చెందిన గగనతలం నుంచి ఉపరితలపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణి! వీటిలో క్రిస్టల్ మేజ్-1 (రాప్టర్), క్రిస్టల్ మేజ్-2(రాక్స్) రకాలను భారత్ వాడుతోంది. వీటి బరువు 1,000 కేజీలు ఉండటంతో పాటు 80 కిలోల పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలదు. సుఖోయ్ వంటి యుద్ధ విమానాలు వీటిని ప్రయోగించగలవు. ప్రధానంగా కదిలే లక్ష్యాలను టార్గెట్ చేయడంలో ఇవి దిట్టని చెబుతారు!

ఇక ర్యాపేజ్ కూడా ఇజ్రాయెల్ కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ తయారుచేసింది. ఇది సూపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టూ గ్రౌండ్ మిసైల్. ఇవి స్పైస్ 2000 బంబుల కంటే ఎక్కువ రేంజ్ ను ఇవ్వగలవు. సుఖోయ్-30, మిగ్-29లు వీటిని ప్రయోగించగలవు!