Begin typing your search above and press return to search.

చినాబ్ పై చుక్ చుక్..శత్రు గుండెల్లో లబ్ డబ్..ఈ కశ్మీర్ రైలు స్పెషల్

ఇటీవల పెహల్గాం దాడుల అనంతరం పాకిస్థాన్ పై భారత్ యుద్ధానికి దిగడంతో పౌర విమాన సేవలను రద్దచేశారు. సైనిక దళాలను అత్యవసరంగా తరలించారు.

By:  Tupaki Desk   |   15 May 2025 3:42 PM IST
చినాబ్ పై చుక్ చుక్..శత్రు గుండెల్లో లబ్ డబ్..ఈ కశ్మీర్ రైలు స్పెషల్
X

ఇటీవల పెహల్గాం దాడుల అనంతరం పాకిస్థాన్ పై భారత్ యుద్ధానికి దిగడంతో పౌర విమాన సేవలను రద్దచేశారు. సైనిక దళాలను అత్యవసరంగా తరలించారు.

ఇక పెహల్గాంలో దాడి అనంతరం అక్కడినుంచి బయటపడేందుకు పర్యటకులు అప్పటికప్పుడు విమాన సర్వీసులను ఆశ్రయిస్తే రేట్లు విపరీతంగా పెంచేశారనే ఆరోపణలు వచ్చాయి.

ఇక కశ్మీర్ అంటే అందాల హిమాలయ పర్వతాలు.. మంచు దుప్పటి కప్పుకొనే ప్రదేశాలు.. అలాంటి రాష్ట్రంలో ప్రయాణం కొన్నిచోట్ల అత్యంత క్లిష్టం.

కానీ, కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా కశ్మీర్ లో రవాణా మార్గాలను సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రైలు మార్గాలపై ఫోకస్ చేస్తోంది.

తాజాగా కట్రా-కాజీగుండ్ మార్గంలో చినాబ్ వంతెన నిర్మాణం పూర్తయింది. దీనిపై స్పెషల్ ట్రైన్ ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే, ఇది ప్రయాణికులను కాదు.. సైనిక బలగాలతో రన్ కావడం గమనార్హం.

అత్యంత భద్రతాపరమైన ఏర్పాట్ల మధ్య రౌండ్ ట్రిప్ (రాక-పోక) పూర్తిచేసింది. వాస్తవానికి కశ్మీర్ ను మిగతా దేశానికి కనెక్ట్ చేసే ఈ చినాబ్ వంతెన మార్గంపై ట్రయల్ రన్ ను ఏప్రిల్ లోనే ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. కానీ, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు.

ఇటీవలి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం ఏమాత్రం లేకుండానే చీనాట్ మార్గంలో ట్రయల్ రన్ చేపట్టారు. దీంతో సైనిక బలగాల రవాణాకు తేలికైన మార్గం అందుబాటులోకి వచ్చినట్లైంది. ట్రయల్ రన్ స్పెషల్ రైలులో సైనికులు కూడా వెళ్లడం గమనార్హం. కశ్మీర్ కు సైన్యం, ఆయుధాల తరలింపు కూడా సులభం కానుంది.