Begin typing your search above and press return to search.

అమరావతికి గుడ్ న్యూస్... ప్రభుత్వం కీలక నిర్ణయం!

తాజాగా అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు నిధుల విడుదలకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. పనులు పరుగెత్తనున్నాయని అంటున్నారు!

By:  Tupaki Desk   |   16 May 2025 9:00 PM IST
అమరావతికి గుడ్ న్యూస్... ప్రభుత్వం కీలక నిర్ణయం!
X

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అంటూ ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తాజాగా అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు నిధుల విడుదలకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. పనులు పరుగెత్తనున్నాయని అంటున్నారు!

అవును... రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా... రాష్ట్ర బడ్జెట్ నుంచి 2025-26 మొదటి త్రైమాసికానికి రూ.2,100 కోట్ల విడుదలకు అనుమతులిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనులకు ప్రభుత్వం బడ్జెట్ లో రూ.6,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

ఇందులో తాజాగా రూ.2,100 కోట్ల విడుదలకు సీ.ఆర్.డీ.ఏ. కమిషనర్ పరిపాలన అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో ఆ అనుమతిని పరిశీలించిన ప్రభుత్వం.. సీ.ఆర్.డీ.ఏ. పీడీ అకౌంట్ కు నిధులు జమ చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు అనుమతులిచ్చింది.

మరోవైపు.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, ఇందనం మొదలైన రంగాల్లో రూ.33,720 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా.. 19 ప్రాజెక్టుల ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందల ద్వారా 34,621 మందికి ఉపాధి లభించనుందని తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన సీఎం చంద్రబాబు... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని.. ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న వెంటనే ప్రాజెక్ట్ ఏర్పాటు పనులను ప్రారంభిస్తున్నాయని.. ఇప్పటికే కొన్ని సంస్థలకు శంకుస్థాపన చేశామని.. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలే పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణమని తెలిపారు.