Begin typing your search above and press return to search.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ నివేదిక వచ్చేసింది!

అవును... అహ్మదాబాద్‌ లో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనపై ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 July 2025 3:12 PM IST
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ నివేదిక వచ్చేసింది!
X

జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ దిగ్భ్రాంతికర విమాన ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలోనూ 241 మంది మృతి చెందగా.. స్థానికంగా ఉన్నవారు 19 మంది మరణించారు. ఈ సమయంలో ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వచ్చినట్లు తెలుస్తోంది.

అవును... అహ్మదాబాద్‌ లో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనపై ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆ మరుసటిరోజే ప్రమాదంపై దర్యాప్తునకు ఏఏఐబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో... ఈ ప్రమాదంపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ఆధారంగా ప్రాథమిక నివేదిక రూపొందించింది.

ఈ క్రమంలో... దాన్ని తాజాగా కేంద్ర పౌర విమాన మంత్రిత్వశాఖతో పాటు సంబంధిత ఇతర అధికారులకు సమర్పించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతానికి ఈ నివేదికలో ఏ విషయం ఉందనేది మాత్రం అధికారులు బయటపెట్టలేదు. ఈ వారాంతంలో ఆ నివేదికను మీడియాకు విడుదల చేసే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

బ్లాక్ బాక్స్ లోని డేటా, కాక్‌ పిట్ వాయిస్ రికార్డర్, మేడే కాల్, చివరి నిమిషంలో సిబ్బంది చర్యలు, వాతావరణ పరిస్థితులు మొదలైన అంశాలతో ఈ ప్రాథమిక నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికతో నాడు జరిగిన ఆ దిగ్భ్రాంతికర ప్రమాదానికి గల కారణాలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది!

కాగా... ఏఏఐబీ డైరెక్టర్‌ జనరల్‌ జీవీజీ యుగంధర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే! ఈ కమిటీలో ఏవియేషన్‌ మెడిసిన్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నిపుణులు, నేషనల్‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు నిపుణులు సభ్యులుగా ఉన్నారు.