'విశ్వంభర'..ఇంకా మౌనంవీడరా సామీ?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామా `విశ్వంభర`. యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.
By: Tupaki Desk | 16 May 2025 11:04 AM ISTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామా `విశ్వంభర`. యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్లో యువీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన దగ్గరి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీఎఫ్ ఎక్స్ విషయంలో విమర్శలు ఎదురవడంతో టీమ్ దానికి సంంధించిన వర్క్ని మళ్లీ చేయించింది. దీంతో కొంత సమయం పట్టింది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ విషయంలో టీమ్ స్పందించకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
ఇటీవల జూన్, జూలైలో విడుదల కావాల్సిన `కింగ్డమ్`, `తమ్ముడు` సినిమాలు ఆకస్మాత్తుగా వాయిదాపడటంతో చిరు `విశ్వంభర` ప్రేక్షకుల ముందుకొస్తుందని అంతా భావించారు. కానీ రిలీజ్కు మంచి టైమ్ లభించినా టీమ్ ఆ విషయంలో మౌనం పాటిస్తుండటం ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నెలలు గడుస్తున్నా టీమ్ సినిమా రిలీజ్ విషయంలో ఓ క్లారిటీకి రాకపోవడంతో మెగా అభిమానుల్లో ఆందోళనతో పాటు అనుమానాలు మొదలయ్యాయి.
ఇటీవల `జగదేకవీరుడు అతిలోక సుందరి` చిత్రాన్ని రీ రిలీజ్ చేయడం తెలిసిందే. ఇదే తరహాలో సోషియో ఫాంటసీ కథతో `విశ్వంభర` రూపొందుతుండటంతో ఈ మూవీపై అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ని విడుదల చేసి ప్రమోషన్స్ని ప్రారంభించిన టీమ్ ఇప్పటి వరకు రిలీజ్పై ఓ క్లారిటీకి రాలేకపోవడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్కు టైమ్ లభించినా టీమ్ రిలీజ్ గురించి ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం నిర్మాణ సంస్థ ఇబ్బందుల్లో పడటమేనని తెలుస్తోంది.
ఈ మూవీని ముందు ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ముందు ప్రకటించారు. కానీ అది కుదరలేదు. తరువాత మే లో రిలీజ్ చేస్తామన్నారు. అదీ కూడా జరగలేదు. ఇక ఫైనల్గా `ఇంద్ర` రిలీజైన జూలై 24న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ డేట్న `విశ్వంభర` రావడం కష్టమని యువీకి, మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుల సమాచారం. ఈ డేట్ వాయిదా పడితే ఆగస్టులో రావడం కష్టం. ఆగస్టులో వార్ 2, రజనీ కూలీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
వాటితో పోటీగా `విశ్వంభర`ని రిలీజ్ చేయాలనే ఆలోచన మేకర్స్కు లేదు. కానీ జూలై 24న కూడా రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఇప్పటికైనా మౌనం వీడరా సామీ అని మెగా అభిమానులు కోరుతున్నారు. కానీ తాజా పరిస్థితులని బట్టి చూస్తే జూలై 24న `విశ్వంభర` విడుదల కష్టమేనని తెలుస్తోంది. దీంతో నితిన్ `తమ్ముడు` మూవీని ఆ డేట్న రిలీజ్ చేయాలని దిల్ రాజు సన్నాహాలు చేసుకుంటున్నారట.