వీడియో : మెగా హీరో 'పిజ్జా' మేకింగ్ చూశారా!
మెగా వారి ఇంటి కోడలు అయిన లావణ్య త్రిపాఠి తాజాగా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తాను లేదు, ఆమె భర్త వరుణ్ తేజ్ ఉన్నాడు.
By: Tupaki Desk | 16 May 2025 11:40 AM ISTసెలబ్రిటీ కపుల్స్ వీడియోలు సోషల్ మీడియాలో రెగ్యులర్గా వైరల్ అవుతూనే ఉంటాయి. భర్తల కోసం భార్యలు ఏం చేసినా, భార్యల కోసం భర్తలు ఏం చేసినా అది పెద్ద విషయం అవుతుంది. ఇక సెలబ్రిటీ కపుల్ షేర్ చేసే ఫోటోలు, వీడియోలకు మంచి స్పందన లభిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తమ అభిమానులతో చేరువగా ఉండటం కోసం సెలబ్రిటీలు ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ రెగ్యులర్గా సోషల్ మీడియా ద్వారా ఏదో ఒకటి షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు రొటీన్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటే, కొన్ని సార్లు ట్రావెల్కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తారు. కొందరు మాత్రం తమ వంటలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.
మెగా వారి ఇంటి కోడలు అయిన లావణ్య త్రిపాఠి తాజాగా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తాను లేదు, ఆమె భర్త వరుణ్ తేజ్ ఉన్నాడు. వీరిద్దరు టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్లో ఒకరు అనడంలో సందేహం లేదు. అలాంటి వీరిద్దరు కలిసి ఉన్న వీడియోలకు మంచి స్పందన వస్తూ ఉంటుంది, వీరిద్దరు కలిసి ఫోటోలు దిగినా కూడా వాటికి నెట్టింట మంచి స్పందన రావడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా లావణ్య త్రిపాఠి ఇన్స్టాగ్రామ్లో వరుణ్ తేజ్ వంట చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అంతే కాకుండా వరుణ్ కి తనపై ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నాను అన్నట్లుగా అర్థం వచ్చే విధంగా కామెంట్ ను షేర్ చేసింది.
ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే విషయం తెల్సిందే. ఆమె పూర్తిగా విశ్రాంతి మూడ్లో ఉంది. కనుక ఆమెకు ఏం కావాలన్నా కూడా వరుణ్ దగ్గర ఉండి చూసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడూ షూటింగ్స్తో బిజీగా ఉండే వరుణ్ తేజ్ ప్రస్తుతం భార్య లావణ్య త్రిపాఠితో ఎక్కువ సమయం గడిపేందుకు గాను సమయం కేటాయిస్తూ ఉన్నాడు. అంతే కాకుండా తన చేతితో వండిన వంటను తినిపించడం మాత్రమే కాకుండా ఆమెతో క్వాలిటీ టైమ్ను స్పెండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి కోసం సరదాగా వరుణ్ తేజ్ పిజ్జా చేశాడు. ఆ వీడియోను లావణ్య త్రిపాఠి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గంటల్లో లక్షల మంది చూశారు. లక్షల మంది లైక్ చేసి, షేర్ చేశారు.
వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ భారీ కమర్షియల్ సినిమాలో కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్తో కలిసి నిర్మిస్తున్నారు. రితికా నాయక్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. వరుణ్ తేజ్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గత ఏడాది మట్కా, ఆపరేషన్ వాలైంటెన్ సినిమాలు విడుదల అయ్యాయి. కానీ వాటితో వరుణ్ తేజ్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి వరుణ్ తేజ్ సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.