Begin typing your search above and press return to search.

సైలెంట్ గా వచ్చి 200 కోట్లు కొట్టేశాడు

మలయాళ సినిమా ఇండస్ట్రీలో విడుదలయ్యే సినిమాలు చాలా వరకు సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేస్తుంటాయి.

By:  Tupaki Desk   |   12 May 2025 10:42 AM IST
సైలెంట్ గా వచ్చి 200 కోట్లు కొట్టేశాడు
X

మలయాళ సినిమా ఇండస్ట్రీలో విడుదలయ్యే సినిమాలు చాలా వరకు సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేస్తుంటాయి. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘తుడరుమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తోంది. తరుణ్ మూర్తి డైరెక్షన్‌లో ఏప్రిల్ 25న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మోహన్‌లాల్‌తో పాటు శోభన, ఫర్హాన్ ఫాసిల్, మణియన్‌పిళ్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఆర్ష చాందిని బైజు, తామస్ మాథ్యూ, కృష్ణ ప్రభలు కీలక పాత్రల్లో నటించారు.

ప్రమోషన్ లో హడావుడి పెద్దగా కనిపించలేదు. కానీ సినిమా కథ, నటన, సాంకేతికతపై పాజిటివ్ టాక్ రావడంతో మౌత్ టాక్ తోనే పబ్లిసిటీ వచ్చేసింది. ‘తుడరుమ్’ సినిమా మలయాళ ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి వారంలోనే కేరళలో రూ.20 కోట్ల గ్రాస్ సాధించింది. తొలి మూడు రోజుల్లో డొమెస్టిక్ బాక్సాఫీస్ వద్ద రూ.28 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.41.50 కోట్లు వసూలు చేసి, మొత్తం రూ.69.50 కోట్ల గ్రాస్‌తో దూసుకెళ్లింది.

ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో రెండో అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్ సాధించిన చిత్రంగా నిలిచింది, మొదటి స్థానంలో మోహన్‌లాల్ ‘ఎంపురాన్’ (రూ.174 కోట్లు) ఉంది. విడుదలైన 16 రోజుల్లో ‘తుడరుమ్’ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.200 కోట్ల మార్క్‌ను దాటింది. దీంతో మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన మరో చిత్రంగా నిలిచింది.

ఈ ఘనతను గతంలో ‘మంజుమ్మల్ బాయ్స్’ (రూ.242 కోట్లు), ‘ఎంపురాన్’ (రూ.268 కోట్లు) సాధించాయి. కేవలం ఒక నెల వ్యవధిలోనే మోహన్‌లాల్ వరుసగా రెండు రూ.200 కోట్ల సినిమాలతో సంచలనం సృష్టించాడు, ‘ఎంపురాన్’ మార్చి 27న విడుదలైంది. మోహన్‌లాల్ నటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు, ‘తుడరుమ్’ కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ‘2018’ (రూ.89.40 కోట్లు) రికార్డును అధిగమించింది.

అయితే, ‘ఎంపురాన్’ రూ.250 కోట్లు సాధించినప్పటికీ కేరళలో ‘2018’ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. ‘తుడరుమ్’ 12 రోజుల్లో రూ.175.59 కోట్ల గ్రాస్ సాధించి, రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో మోహన్‌లాల్ 2025లో రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది, ఎందుకంటే ‘ఎంపురాన్’ రూ.268.05 కోట్ల గ్రాస్ సాధించింది, మొత్తం రూ.443.64 కోట్లతో మలయాళం మార్కెట్ లో టాప్ బిజినెస్ చేసిన హీరోగా ఉన్నాడు. ‘తుడరుమ్’ మరో రూ.56 కోట్లు సాధిస్తే, విక్కీ కౌశల్ తర్వాత 2025లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ నటుడిగా మోహన్‌లాల్ నిలుస్తాడు.