తీరిక లేని షెడ్యూళ్లతో నలిగిపోతున్న మిల్కీ
2005లో శ్రీ అనే చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసింది తమన్నా భాటియా. దాదాపు రెండు దశాబ్ధాల కెరీర్ రన్ పూర్తి చేసింది.
By: Tupaki Desk | 16 May 2025 6:00 PM IST2005లో శ్రీ అనే చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసింది తమన్నా భాటియా. దాదాపు రెండు దశాబ్ధాల కెరీర్ రన్ పూర్తి చేసింది. ఇలాంటి ఎగ్జయిటింగ్ కెరీర్ చాలా మంది సమకాలీన కథానాయికలకు లేదు. కెరీర్ పోరాటం సాగించలేక మిడిల్ డ్రాప్ అయిన కథానాయికలు ఉన్నారు. కానీ ముంబై టు హైదరాబాద్ తమన్నా జర్నీ ఇంట్రెస్టింగ్. చాంద్ షా రోషన్ తమన్నాకు హిందీలో డెబ్యూ మూవీ. ఆ తర్వాత శ్రీ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి, హ్యాపీడేస్ తో సంతృప్తికరమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు అందుకుంది. తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్ గా స్టార్ డమ్ అందుకున్న తమన్నా బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలోను నటించింది.
అయితే తమన్నా కెరీర్ లో విజయాల కంటే ఫ్లాపులే ఎక్కువ. అందువల్ల ప్రతిసారీ తమన్నా పని అయిపోయింది! అంటూ మీడియాలో ప్రచారం సాగేది. కానీ అన్నిటినీ అధిగమించి కెరీర్ బెస్ట్ ఫేజ్ కి ఎదిగింది తమన్నా. టాలీవుడ్ కోలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసనా కథానాయికగా నటించింది. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత కూడా తమన్నా కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఆస్వాధిస్తోంది. ప్రస్తుత సంవత్సరంలో వరుసగా అరడజను ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. ఇటీవల ఆజ్ కీ రాత్.. నషా వంటి ఐటమ్ నంబర్లతోను తమన్నా మెరుపులు మెరిపించింది.
హిమ్మత్ వాలా, రైడ్ 2 తర్వాత అజయ్ దేవగన్ తో కలిసి `రేంజర్` లో నటిస్తోంది. అడవి నేపథ్యంలో ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. అలాగే వేదా తర్వాత మరోసారి జాన్ అబ్రహం తో జతకట్టనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జిత్ దోసాంజ్ లతో కలిసి రెండు వేర్వేరు ప్రాజెక్టులలోను నటిస్తోంది. వీటితో పాటు ఒక భారీ క్రేజీ వెబ్ సిరీస్ లోను తమన్నా భాగమైంది. కెరీర్ పరంగా ఇది బెస్ట్ ఫేజ్ అని తమన్నా భావిస్తోంది. టాలీవుడ్ లో ఓదెల 2 ఇటీవలే విడులైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలువురు దర్శకులు తమన్నాకు స్క్రిప్టులు వినిపిస్తున్నారని సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ తో తమన్నా 20 ఏళ్ల కెరీర్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకోనుంది.