శోభన్ బాబు వారసులు ఇండస్ట్రీకి రాకపోవడానికి కారణం?
సోగ్గాడు శోభన్ బాబు ఆయన తరంలో రాజుగా ఏలాడు. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా వెలిగిన శోభన్ బాబు భారీ మహిళా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు
By: Tupaki Desk | 16 May 2025 9:24 AM ISTసోగ్గాడు శోభన్ బాబు ఆయన తరంలో రాజుగా ఏలాడు. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా వెలిగిన శోభన్ బాబు భారీ మహిళా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు వంటి దిగ్గజ హీరోలతో పాటు, ఆయన తన ఉనికిని దశాబ్ధాల పాటు చాటుకున్నారు. ఇద్దరు హీరోయిన్ లతో నారీ నారీ నడుమ రొమాంటిక్ బోయ్ పాత్రలు పోషించడంలో శోభన్ బాబు తర్వాతేనని ప్రూవ్ అయింది. లాయర్ కాబోయి యాక్టర్ అయ్యారు శోభన్ బాబు.
అయితే టాలీవుడ్ లో విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ వారసుల్ని హీరోలుగా పరిచయం చేస్తున్న వేళ శోభన్ బాబు లాంటి అగ్ర కథానాయకుడి కుటుంబం నుంచి ఎవరూ సినీపరిశ్రమకు రాకపోవడం ఆశ్చర్యపరిచింది. ఆయన కుమారుడు కానీ, మనవడు కానీ సినీరంగంలో ప్రవేశించలేదు. కానీ శోభన్ బాబు కుటుంబం నుంచి కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని రకరకాల వృత్తుల్లో రాణిస్తున్నారని కథనాలొచ్చాయి.
చాలా కాలానికి శోభన్ బాబు మనవడు, కుమార్తె మృధుల కుమారుడు సురక్షిత్ డాక్టర్ వృత్తిలో ఉన్నట్టు పలు మీడియా చానెళ్లు ఇంటర్వ్యూలు వేయడం ఆసక్తిని కలిగించింది. అతడు నటుడు కాకపోవడానికి కారణాలను వెల్లడించాడు. తనకు పదో తరగతిలో ఉండగానే నటనలోకి రావాల్సిందిగా అవకాశాలొచ్చాయని, కానీ ఆసక్తి లేదని తెలిపారు. చాలామంది దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. అంతేకాదు తాత శోభన్ బాబును ప్రజలు సోగ్గాడిగా చూస్తారు. సక్సెస్ ఫుల్ హీరోగా మాత్రమే గుర్తుంచుకుంటారు. కానీ ఈ విజయం అంత సులువుగా రాలేదు. ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాకే హీరోగా రాణించారు అని డాక్టర్ సురక్షిత్ తెలిపాడు. తాతయ్య కష్టాలన్నిటినీ చూశాము కాబట్టి సినీ రంగంలోకి వెళ్లాలని అనుకోలేదని తెలిపారు.